INDvsENG: తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్... రిషబ్ పంత్ అసంతృప్తి...
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్నైట్ స్కోరు 300/6 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా, మరో 29 పరుగులు మాత్రమే జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు భారత జట్టు చేసిన 29 పరుగుల్లో 25 పరుగులు రిషబ్ పంత్ బ్యాటు నుంచే రావడం విశేషం.
రెండో రోజు తొలి ఓవర్ వేసిన మొయిన్ ఆలీ, 5 పరుగులు చేసిన అక్షర్ పటేల్ను, ఆ వెంటనే ఇషాంత్ శర్మను అవుట్ చేశాడు. నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
గత నాలుగు ఇన్నింగ్స్ల్లో రిషబ్ పంత్కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా, టెస్టుల్లో ఆరో హాఫ్ సెంచరీ... 2021లో నాలుగు టెస్టులు ఆడిన రిషబ్ పంత్, 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు...
గత నాలుగు ఇన్నింగ్స్ల్లో రిషబ్ పంత్కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా, టెస్టుల్లో ఆరో హాఫ్ సెంచరీ... 2021లో నాలుగు టెస్టులు ఆడిన రిషబ్ పంత్, 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు...
తొమ్మిదో వికెట్కి 15 బంతులు ఆడిన కుల్దీప్ యాదవ్ను నాన్స్టైయికింగ్ ఎండ్లో నిలబెడుతూ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రిషబ్ పంత్. అయితే 15 బంతులాడిన పరుగులేమీ చేయలేకపోయిన కుల్దీప్ యాదవ్ను ఓల్లీ స్టోన్ అవుట్ చేయడంతో 325 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది టీమిండియా.
ఆ తర్వాత వచ్చిన మహ్మద్ సిరాజ్ మొదటి బంతికే బౌండరీ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికి కూడా బౌండరీ బాదేందుకు ప్రయత్నించి, కీపర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు సిరాజ్...
ఓ వైపు బౌండరీలు బాదుతున్నా, తనకు స్టైయికింగ్ ఇవ్వకుండా సిరాజ్ బౌండరీలు బాదాలని ప్రయత్నించి, అవుట్ కావడంతో రిషబ్ పంత్ నిరుత్సాహానికి గురైనట్టు స్పష్టంగా కనిపించింది. సిరాజ్ కోసం చూడకుండానే పెవిలియన్కి చేరాడు రిషబ్ పంత్. .
టీమిండియా ఇన్నింగ్స్లో నలుగురు బ్యాట్స్మెన్ డకౌట్ కావడం విశేషం. శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మొయిన్ ఆలీకి నాలుగు వికెట్లు దక్కగా, ఓల్లీ స్టోన్కి మూడు వికెట్లు దక్కాయి. జాక్ లీచ్ రెండు, జో రూట్ ఓ వికెట్ తీశారు. 95.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఒక్క అదనపు పరుగు (ఎక్స్ట్రా) కూడా లేకపోవడం విశేషం.
బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో రోరీ బర్న్స్ డకౌట్ అయ్యాడు. టీమిండియా మాదిరిగానే సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.