INDvsAUS: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా... భార్యా పిల్లలతో కలిసి... విరాట్ మాత్రం అలా...
IPL 2020 సీజన్కి ముగింపు కార్డు పడిన రెండో రోజు ఆస్ట్రేలియా గడ్డ మీద వాలిపోయింది భారత క్రికెట్ బృందం. ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్తో పాటు మూడు టీ20, మూడు వన్డే మ్యాచుల సిరీస్లను కూడా ఆడనుంది. కరోనా నిబంధనల కారణంగా 14 రోజుల ముందే ఆస్ట్రేలియా చేరిన భారత బృందం... అక్కడ క్వారంటైన్లో గడుపుతోంది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ సిరీస్కు క్రికెటర్లతో పాటు వారి కుటుంబాన్ని కూడా అనుమతించింది బీసీసీఐ. దీంతో ఆసీస్ టూర్కి ఎంపికైన క్రికెటర్లు అందరూ భార్యాపిల్లలతో అక్కడ వాలిపోయారు.
భార్యా, కూతురితో భారత టెస్టు స్పెషలిస్టు క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా...
భార్యా, కూతురితో భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే...
భార్యా, కూతురితో సెల్ఫీకి ఫోజు ఇచ్చిన భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా...
భార్యా, పిల్లలతో భారత సీనియర్ స్పిన్నర్, ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఒంటరిగానే ఆస్ట్రేలియా బయలుదేరాడు. దుబాయ్లో ధావన్ వెంటే ఉన్న ఆయన కుటుంబం స్వదేశం చేరింది.
దుబాయ్ ఎయిర్పోర్టులో ఫోటోకి ఫోజు ఇచ్చిన భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా...
దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తున్న యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్..
ఫోటోకి స్టైల్గా ఫోజిచ్చిన భారత యంగ్ పేసర్ నవ్దీప్ సైనీ...
ఐపీఎల్ సమయంలో తన వెంటే ఉన్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, డెలివరీ కోసం స్వదేశం బయలుదేరింది. ఆసీస్ టూర్కి పయనమైన కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నాడు.
ఐపీఎల్ సమయంలో కొడుకు అగస్త్యను బాగా మిస్ అయిన భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా, మరో రెండు నెలల పాటు భార్యా కొడుకుకి దూరంగా గడపబోతున్నాడు.