INDvsAUS: ఆస్ట్రేలియాలో కరోనా బీభత్సం... ఐసోలేషన్లో ఆసీస్ జట్టు, అడిలైడ్ టెస్టు కష్టమే...
ఐపీఎల్, టీ20 వరల్డ్కప్... ఇలా అనేక సిరీస్లు రద్దు కావడానికి, వాయిదా పడడానికి కారణమైన కరోనా... ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లో కూడా మరోసారి పంజా విసిరిటట్టే కనిపిస్తోంది. దక్షిణా ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అటు ఆస్ట్రేలియా, ఇటు టీమిండియా కలవరపడుతున్నాయి.
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దశలో ఇక్కడ లీగ్ నిర్వహిస్తే కష్టమని గ్రహించిన బీసీసీఐ, ఐపీఎల్ నిర్వహణను ఏడాది దేశం యూఏఈలో నిర్వహించింది.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆస్ట్రేలియాతో టూర్కి ఎలాంటి ఇబ్బంది రాదని భావించారు ఇరు దేశాల క్రికెటర్లు...
మొదటి టెస్టు జరగబోతున్న ఆడిలైడ్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ క్వారంటైన్ హోటెల్లో పనిచేసే వర్కర్ ద్వారా స్థానికంగా నివాసముండే ఓ కుటుంబానికి కరోనా సోకింది...
కరోనా కేసులు పెరుగుతుండడంతో దక్షిణ ఆస్ట్రేలియాలో ప్రజలంతా అప్రమత్తుంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం... స్కూళ్లు, షాపులు, వాణిజ్యభవనాలు మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆడిలైడ్లోనే ఎక్కువ మ్యాచులు ఆడబోతోంది టీమిండియా. విరాట్ కోహ్లీ ఆడే మొదటి టెస్టు మ్యాచ్ కూడా ఇక్కడే జరగబోతోంది. ‘పింక్ బాల్’ టెస్టుగా పిలిచే ఈ డే నైట్ టెస్టుకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు కూడా హాజరవుతారని చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా.
27 వేల మంది కెపాసిటీ ఉన్న ఆడిలైడ్ స్టేడియంలో జరిగే మొదటి టెస్టులో సామాజిక దూరం పాటిస్తూ సగం మందిని మ్యాచ్ చూడడానికి అనుమతి ఇస్తామని చెప్పింది ఆసీస్ క్రికెట్ బోర్డు.
దక్షిణ ఆస్ట్రేలియాలో మ్యాచులు ఆడిన ఆసీస్ క్రికెటర్లు ఐసోలేషన్లో ఉన్నట్టు ప్రకటించారు. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్తో పాటు ఐదుగురు క్రికెటర్లు ఐసోలేషన్లోకి వెళ్లినట్టు ప్రకటించారు. వీరికి త్వరలో కరోనా టెస్టులు కూడా నిర్వహించబోతున్నారు.
అయితే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆడిలైడ్ టెస్టు నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ మ్యాచ్ జరిగినా, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం మాత్రమే అనుమానమే.
నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్లో భారత క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులతో పాటు నాలుగు టెస్టు మ్యాచులు కూడా ఆడబోతోంది...