రిషబ్ పంత్ ఆట చూస్తుంటే వచ్చే కిక్కే వేరు... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్...
రిషబ్ పంత్... ఆస్ట్రేలియా టూర్ నుంచి ఈ యంగ్ వికెట్ కీపర్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. తన దూకుడుని కొనసాగిస్తూనే, బాధ్యతాయుతంగా ఆడడమూ నేర్చుకున్నాడు రిషబ్ పంత్. మనోడి ఆటతీరుకి ఫిదా అయ్యానంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
‘టీమిండియా ఇప్పుడు ఓ సూపర్ పవర్ టీమ్... జట్టులో ఉన్న ఆటగాళ్లతో పాటు రిజర్వు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో ప్రతీ క్రికెట్ అభిమానికి స్పష్టంగా అర్థమయింది...
సునీల్ గవాస్కర్ జట్టులో ఉన్నప్పుడు, అతను రిటైర్ అయ్యాక టీమిండియా పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందారు అభిమానులు. అయితే ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, కుంబ్లే లాంటి ప్లేయర్లు వచ్చారు...
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా మునుపటిలా ఆడలేదని అనుమానించారు... కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నతీరు చూసి, అందరితో పాటే నేను ఆశ్చర్యపోతున్నా...
ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లు మనదేశంలో, మన జట్టులో ఉన్నారు... తరాలు మారే కొద్దీ, మరింత సత్తా కలిగిన ప్లేయర్లు, పుట్టుకొస్తుండడం టీమిండియా స్పెషాలిటీ...
నేను 1992లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేశాను. కానీ ఆ పర్యటనలో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. యువకుడిననే ఉద్దేశంతో నన్ను తుది జట్టులో లేకుండా చేశారు...
ఆ పర్యటనే నన్ను పూర్తిగా మార్చింది. మెరుగైన క్రికెటర్గా తీర్చిదిద్దుకునేలా చేసింది. మానసికంగా, శారీరకంగా దృఢంగా మారేలా చేసింది... 1996లో ఇంగ్లాండ్ పర్యటనలో నాకు మళ్లీ ఛాన్స్ వచ్చింది...
అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు చేయాలంటే ఏం చేయాలో నాకు అర్థమైంది... వైఫల్యాలే ఏ క్రికెటర్నైనా మరింత మెరుగయ్యేలా చేస్తాయి... అందుకే రిషబ్ పంత్ను చూస్తుంటే నాకు, నేను కనిపిస్తుంటాను..
ఆస్ట్రేలియాలో రిషబ్ పంత్ ఆటతీరు చూసి అతనికి అభిమానిగా మారిపోయా... నిజానికి బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉన్న నేను, నాకు ఏ ఆటగాడు అంటే ఇష్టమో చెప్పకూడదు..
అయితే పంత్ పర్ఫామెన్స్, అతన్ని మ్యాచ్ విన్నర్గా మార్చేసింది. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను...
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ బౌలింగ్ నాకు బాగా నచ్చుతుంది. శార్దూల్ ఠాకూర్ డేరింగ్ బ్యాటింగ్, బౌలింగ్ పర్ఫామెన్స్ కూడా నాకెంతో ఇష్టం...’ అంటూ వ్యాఖ్యానించాడు సౌరవ్ గంగూలీ...
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటర్గా వ్యవహారించాడు సౌరవ్ గంగూలీ. గత సీజన్లో కూడా యువ ఆటగాళ్లతో నిండిన ఢిల్లీకి మద్ధతు ఇస్తున్నట్టు తెలిపాడు దాదా...