సారీ మోరిస్, ఇప్పుడు కూడా నేను సింగిల్ తీయను... సంజూ శాంసన్ కామెంట్...
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో దాదాపు ఓటమి ఖాయం అనుకున్న సమయంలో నాలుగు అద్భతమైన సిక్సర్లతో రాజస్థాన్ రాయల్స్కి సీజన్లో తొలి విజయాన్ని అందించాడు క్రిస్ మోరిస్. దీంతో గత మ్యాచ్లో సంజూ శాంసన్, సింగిల్ తీసి అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చినా క్రిస్ మోరిస్... 8వ వికెట్కి జయ్దేవ్ ఉనద్కడ్తో కలిసి 46 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి, జట్టుకు విజయాన్ని అందించాడు.
కగిసో రబాడా వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రాబట్టిన క్రిస్ మోరిస్, టామ్ కుర్రాన్ వేసిన 20వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది... రాజస్థాన్ రాయల్స్కి సీజన్లో తొలి విజయం అందించాడు...
ఈ ఇన్నింగ్స్ తర్వాత గత మ్యాచ్లో ఆఖరి ఓవర్ ఐదో బంతికి సంజూ శాంసన్, క్రిస్ మోరిస్కి స్ట్రైయింగ్ ఇవ్వకుండా వెనక్కి పంపడాన్ని తప్పుబడుతున్నారు అభిమానులు..
రబాడా బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదిన క్రిస్ మోరిస్, పెద్దగా అనుభవం లేని ఆర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఈజీగా సిక్సర్ బాదేవాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
అయితే ఇప్పటికీ, క్రిస్ మోరిస్కి స్ట్రైయికింగ్ ఇవ్వనందుకు ఫీల్ కావడం లేదని అంటున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...
‘ఇప్పుడే కాదు, మరో 100 సార్లు అలాంటి మ్యాచ్ ఆడినా సరే... ఆ సమయంలో సింగిల్ తీయడానికి నేను ఇష్టపడను... ’ అంటూ మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు సంజూ శాంసన్..
ఆఖరి రెండు ఓవర్లలో 29 పరుగులు రాబట్టిన క్రిస్ మోరిస్, ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన చేధనలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు...
ఇంతకుముందు 2010లో మహేంద్ర సింగ్ ధోనీ, పంజాబ్పై ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టాడు. 2020లో కేకేఆర్పై ఆఖరి రెండు ఓవర్లలో 29 పరుగులు చేసిన జడేజా, క్రిస్ మోరిస్తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు.
2021లో రాజస్థాన్ ఆడిన మొదటి మ్యాచ్లో సంజూ శాంసన్ నిరాకరించిన తర్వాత క్రిస్ మోరిస్... అదిరిపోయే కమ్బ్యాక్ ఇవ్వగా, 2020లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ సింగిల్ తీయకపోవడానికి ఇష్టపడకపోవడం వల్ల హార్ట్ అయిన రాహుల్ తెవాటియా, ఆ తర్వాతి ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు..