నాలుగో రోజూ ఆగని వర్షం... ఇలా అయితే ఫైనల్ మ్యాచ్లో రిజల్ట్ రావడం కష్టమే...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్పై వరుణుడు ఏ మాత్రం కరుణ చూపించడం లేదు. ఇప్పటికే రోజున్నరకు పైగా ఆట వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నాలుగో రోజూ కూడా సౌంతిప్టన్లో వర్షం కురుస్తోంది.

<p>సోమవారం తెల్లవారుజామున సౌంతిప్టన్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్టు ప్రకారం చూస్తే మాత్రం నేడు ఆట సజావుగా సాగే అవకాశం లేదు..</p>
సోమవారం తెల్లవారుజామున సౌంతిప్టన్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్టు ప్రకారం చూస్తే మాత్రం నేడు ఆట సజావుగా సాగే అవకాశం లేదు..
<p>మొదటి రోజు పూర్తిగా రద్దు కావడంతో రిజర్వు డేని ఐదో రోజుగా పరిగణిస్తే నేడు ఆటలో మూడో రోజు అవుతుంది. అంటే మ్యాచ్లో టీమిండియా కమ్బ్యాక్ ఇవ్వాలంటే రెండు రోజుల్లో 28 వికెట్లు తీయాల్సి ఉంటుంది...</p>
మొదటి రోజు పూర్తిగా రద్దు కావడంతో రిజర్వు డేని ఐదో రోజుగా పరిగణిస్తే నేడు ఆటలో మూడో రోజు అవుతుంది. అంటే మ్యాచ్లో టీమిండియా కమ్బ్యాక్ ఇవ్వాలంటే రెండు రోజుల్లో 28 వికెట్లు తీయాల్సి ఉంటుంది...
<p>అయితే నిన్న జరిగిన పర్ఫామెన్స్ చూస్తుంటే మనోళ్ల నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో 101 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 116 పరుగుల దూరంలో ఉంది.</p>
అయితే నిన్న జరిగిన పర్ఫామెన్స్ చూస్తుంటే మనోళ్ల నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో 101 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 116 పరుగుల దూరంలో ఉంది.
<p>టీమిండియా మ్యాచ్లో తిరిగి పుంజుకోవాలంటే నేడు తొలి సెషన్లో కనీసం మూడు వికెట్లు తీయాలి. రెండో సెషన్లో న్యూజిలాండ్ను ఆలౌట్ చేయాలి.</p>
టీమిండియా మ్యాచ్లో తిరిగి పుంజుకోవాలంటే నేడు తొలి సెషన్లో కనీసం మూడు వికెట్లు తీయాలి. రెండో సెషన్లో న్యూజిలాండ్ను ఆలౌట్ చేయాలి.
<p>అప్పుడే భారత జట్టు నేటి సాయంత్రం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు అవకాశం ఉంటుంది..</p>
అప్పుడే భారత జట్టు నేటి సాయంత్రం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు అవకాశం ఉంటుంది..
<p>లేదా ఈ రోజు మొత్తం న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 300+ స్కోరు కానీ చేశారా... ఇక మ్యాచ్ ఫలితం పూర్తిగా కివీస్ చేతుల్లోకి వెళ్లినట్టే అవుతుంది. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో కివీస్కి 100+ దక్కితే అది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది...</p>
లేదా ఈ రోజు మొత్తం న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 300+ స్కోరు కానీ చేశారా... ఇక మ్యాచ్ ఫలితం పూర్తిగా కివీస్ చేతుల్లోకి వెళ్లినట్టే అవుతుంది. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో కివీస్కి 100+ దక్కితే అది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది...
<p>టీమిండియా రెండో ఇన్నింగ్స్లో తొలి ఇన్నింగ్స్కంటే ఎక్కువ పరుగులు చేసినా, కివీస్కి వచ్చే టార్గెట్ 150+ మాత్రమే ఉంటుంది. అదే జరిగితే న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించగలదు...</p>
టీమిండియా రెండో ఇన్నింగ్స్లో తొలి ఇన్నింగ్స్కంటే ఎక్కువ పరుగులు చేసినా, కివీస్కి వచ్చే టార్గెట్ 150+ మాత్రమే ఉంటుంది. అదే జరిగితే న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించగలదు...