ఆకాశమే హద్దుగా! చెలరేగిన టీమిండియా... రోహిత్, కోహ్లీ, సూర్య సూపర్ షో...
సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది... ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, మూడో మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా అందరూ బ్యాటు ఝులింపించారు.
ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి తొలి వికెట్కి అద్బుతమైన 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ...
రోహిత్ శర్మ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడడంతో తుఫాన్ వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించింది టీమిండియా... 9 ఓవర్లలలోనే 94 పరుగులు చేసింది టీమిండియా..
ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో తొలి వికెట్కి వచ్చిన మొట్టమొదటి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం ఇదే. గత నాలుగు మ్యాచుల్లో కలిసి కేవలం 30 పరుగులే వచ్చాయి.
34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన రోహిత్ శర్మ... టీ20ల్లో 26వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.
విరాట్ కోహ్లీ 28 తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్మెన్గా ఉన్నాడు రోహిత్ శర్మ...
రోహిత్ శర్మ సృష్టించిన పరుగుల సునామీలో తడిసి ముద్దయిన ఇంగ్లాండ్ జట్టుకి తొలి బ్రేక్ అందించాడు బెన్ స్టోక్స్. 94 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.
అత్యధికసార్లు ఒకే ఇన్నింగ్స్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా నిలిచాడు రోహిత్ శర్మ. రోహిత్ 10 సార్లు ఈ ఫీట్ సాధించగా మున్రో 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు.
బెన్ స్టోక్స్ ఓవర్లో ఓ సిక్స్, ఓ ఫోర్తో 13 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ, ఆఖరి బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. అయితే వస్తూనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు సూర్యకుమార్ యాదవ్.
తాను ఎదుర్కొన్న రెండు, మూడు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు...
బెన్ స్టోక్స్ బౌలింగ్లో సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో స్వదేశంలో 50 సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. రోహిత్ శర్మ 55 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు...
17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ను, అదిల్ రషీద్ బౌలింగ్లో బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్తో అవుట్ చేశాడు జోర్డాన్... 143 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా...
మొదటి రెండు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా టాప్లో నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. మన్దీప్ సింగ్ 83, అజింకా రహానే 61 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 89 పరుగులు చేశాడు.
అత్యధిక పరుగులు చేసిన టీ20 కెప్టెన్గా ఆరోన్ ఫించ్ను అధిగమించి, టాప్లో నిలిచాడు విరాట్ కోహ్లీ.
36 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ... కెప్టెన్గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గానూ కేన్ విలియంసన్ను వెనక్కినెట్టాడు.
విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో పరుగులు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో మొదటి వికెట్కి 94 పరుగులు, రెండో వికెట్కి 49 పరుగుల భాగస్వామ్యం దక్కగా మూడో వికెట్కి పాండ్యా, కోహ్లీ కలిసి 81 పరుగులు జోడించారు.