సురేశ్ రైనాకి ముంబైలోని నిబంధనల గురించి తెలీదు... స్నేహితుడి ఆహ్వానంతోనే...
First Published Dec 22, 2020, 5:14 PM IST
ముంబైలో కోవిద్ నిబంధనలను ఉల్లంఘించి, ప్రవర్తించిన కారణంగా భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్టైన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్పోర్టుకి సమీపంలోని ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్లో రాత్రి పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు... రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్లో క్రికెటర్ సురేశ్ రైనాతో పాటు సింగర్ గురు రంధవా సహా 34 మందిని అరెస్టు చేశారు.

సురేశ్ రైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, అరెస్టు కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. బెయిల్పై విడుదలైన సురేశ్ రైనా, అసలు ముంబైకి ఎందుకెళ్లాడనేదానిపై క్లారిటీ ఇచ్చింది సురేశ్ రైనా మేనేజ్మెంట్ టీమ్.

‘సురేశ్ రైనా ఓ షూట్ కోసం ముంబైకి వచ్చారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఓ ఫ్రెండ్ పిలవడంతో డిన్నర్కోసం వెళ్లారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?