విరాట్, రోహిత్ శర్మ తర్వాత ది బెస్ట్ బ్యాట్స్మెన్ అతనే... క్రీజులోకి వచ్చాక...
ఇంగ్లాండ్ సిరీస్లో ఆకట్టుకుని, శ్రీలంక టూర్లో కీలకంగా మారిన సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా, యాదవ్ ఆటతీరును పొగడ్తల్లో ముంచెత్తగా ఇప్పుడీ లిస్టులో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చేరారు...
సూర్యకుమార్ యాదవ్ టాలెంట్ విషయంలో విరాట్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాలకు తక్కవ కాదని ఆశీష్ నెహ్రా కామెంట్ చేశాడు...
‘సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాక మొదటి బంతిని ఆడే విధానం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. అతను అప్పుడే క్రీజులోకి వచ్చినట్టు కనిపించడం లేదు,
అప్పటికే సెంచరీ పూర్తిచేసుకున్నట్టుగా... ఎలా భయం లేకుండా, ఎలాంటి డౌట్స్ లేకుండా... పూర్తి కంట్రోల్గా ఆడుతున్నాడు..
ఓ దేశవాళీ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతుంటే చూడడానికి ఎప్పుడూ బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...
భారత సీనియర్ ప్లేయర్ హర్భజన్ సింగ్ కూడా సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. నేటితరంలో అత్యుత్తమ టాలెంట్ ఉన్న ప్లేయర్లలో ఒకడిగా యాదవ్ను పేర్కొన్నాడు భజ్జీ...
‘నేటితరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత అన్ని ఫార్మాట్లలో అత్యత్తమ టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు... అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్.
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించి, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన సూర్యకుమార్ యాదవ్, తొలి టీ20లో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే...
ఇంగ్లాండ్ టూర్కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది వన్డే, టీ20లతో పాటు టెస్టు సిరీస్లో ఎంట్రీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు...