హార్ధిక్ పాండ్యా ఆలోచన బాగుంది... కోహ్లీ ఆలోచన ఇంకా బాగుంది... హోటల్ గదులకు ముందు...
పెళ్లైన తర్వాత మగాడి ఆలోచనలో మార్పు వచ్చినా, రాకపోయినా తండ్రి అయిన తర్వాత మాత్రం కచ్ఛితంగా వస్తుంది. క్రికెటర్ల విషయంలోనూ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకప్పుడు పార్టీల్లో తెగ ఎంజాయ్ చేసే హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీల్లో వచ్చిన మార్పే ఇందుకు నిదర్శనం..
రెండో టెస్టు ముగిసిన తర్వాత అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా... నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో రెండు టెస్టులు, ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ముగించుకుని... వన్డే సిరీస్ కోసం పూణె బయలుదేరింది...
అహ్మదాబాద్లో క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను వీక్షించిన అభిమానులకు అక్కడ ఓ విషయం బాగా ఆకర్షించింది. అహ్మదాబాద్లో హోటల్ హాయాత్లో భారత క్రికెటర్లకు బస ఏర్పాటు చేసింది బీసీసీఐ...
విరాట్ కోహ్లీ ఉన్న గది ముందు ... ‘హోమ్ స్వీట్ హోమ్’ బోర్డు పెట్టారు. ఇందులో వామిక, అనుష్క, విరాట్ ఉన్నారంటూ రాయించాడు విరాట్ కోహ్లీ... కూతురి పేరుని, ఆ తర్వాత భార్య పేరుని రాయించి, ఆఖర్లో విరాట్ పేరు రాయడం అందర్నీ ఆకట్టుకుంది...
భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా కెప్టెన్ను ఫాలో అయ్యాడు. అయితే పాండ్యా మాత్రం తన గది ముందు రాసిన నేమ్ బోర్డులో ముందు తన పేరు రాసి, ఆ తర్వాత నటాశా, అగస్త్యల పేరు రాశాడు...
ఎంతైనా తండ్రులు కూతురికి ఇచ్చే గౌరవం, కొడుకులకు ఇవ్వరని హార్ధిక్ పాండ్యా మరోసారి నిరూపించాడు. కొడుకుని ఎంత ముద్దుగా చూసుకున్నా, తన పేరు తర్వాత అగస్త్య పేరు రాయించాడు పాండ్యా...
ఒకప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పార్టీల్లో వాలిపోయే హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు కొడుకుకి డైపర్లు మారుస్తూ, వాడితో ఆడుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాడు...
మరోవైపు విరాట్ కోహ్లీ ఎయిర్ పోర్టులో బ్యాగులన్నీ మోసుకొస్తూ కనిపించాడు. ముందు అనుష్క శర్మ, బిడ్డను ఎత్తుకుని ఠీవీగా నడుచుకుంటూ వెళ్తుంటే, వెనకాల సాధారణ సగటు కుటుంబ తండ్రిలా బ్యాగులు మోశాడు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్...
క్రికెటర్ల పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ జోన్ కూడా ఏర్పాటు చేసింది హోటల్ హయాత్ యాజమాన్యం. టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఇక్కడే రోహిత్, ధావన్, పంత్, కుల్దీప్ యాదవ్ కలిసి ఆడుకున్నారు కూడా...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలతో పాటు సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిశా, యజ్వేంద్ర చాహాల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి టీ20 సిరీస్ను ఇదే హోటల్లో ఎంజాయ్ చేశారు...
అహ్మదాబాద్ నుంచి పూణె చేరుకున్న భారత జట్టు, అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్తో ఇంగ్లాండ్ జరుగుతున్న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత నాలుగు రోజులు కుటుంబంతో కలిసి ఐపీఎల్ ఆడనున్నారు భారత క్రికెటర్లు...