MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ, రోహిత్‌తో పాటు జడేజా కూడా వద్దు! వెస్టిండీస్ టూర్‌లో కుర్రాళ్లకే ఛాన్స్... - హర్భజన్ సింగ్

విరాట్ కోహ్లీ, రోహిత్‌తో పాటు జడేజా కూడా వద్దు! వెస్టిండీస్ టూర్‌లో కుర్రాళ్లకే ఛాన్స్... - హర్భజన్ సింగ్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమితో టీమ్ సెలక్షన్ విషయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.. వెస్టిండీస్‌ పర్యటన నుంచి టీమ్‌లో మార్పులు తేవాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 15 2023, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: Getty

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీ20ల నుంచి దూరంగా పెట్టింది టీమిండియా. వీరితో పాటు పేలవ ఫామ్‌తో టీ20ల్లో పరుగులు చేయలేకపోతున్న కెఎల్ రాహుల్ కూడా పొట్టి ఫార్మాట్‌కి దూరమయ్యాడు...

28

వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవసరం లేదంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. వీరితో పాటు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని కూడా టీ20 ఫార్మాట్‌కి దూరంగా పెట్టాలంటూ సలహా ఇస్తున్నాడు భజ్జీ...

38

‘వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ఐదు టీ20 మ్యాచులు ఆడుతోంది. ఎలాగో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లేదు. కాబట్టి కుర్రాళ్లను టీ20 సిరీస్‌కి ఎంపిక చేస్తే బెటర్. హార్ధిక్ పాండ్యా, టీ20 కెప్టెన్‌గా కొనసాగుతాడు. అందులో డౌట్ లేదు..

48
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

కాబట్టి 2024 టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని, కుర్రాళ్లను రెఢీ చేయాలి. ఈ టీమ్, ఏ జట్టునైనా ఓడించేలా ఉండాలి. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో కుర్రాళ్లు, ఎలా ఆడుతున్నారో ఐపీఎల్‌లో చూశాం..

58
Image credit: PTI

Image credit: PTI

సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలి. వీళ్లు ఇప్పటికే కావాల్సినంత క్రికెట్ ఆడేశారు. కాబట్టి ఈ టూర్‌ని కుర్రాళ్లను పరీక్షించేందుకు వాడాలి...

68
Image credit: PTI

Image credit: PTI

యశస్వి జైస్వాల్, అంతర్జాతీయ క్రికెట్‌కి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతన్ని వెస్టిండీస్ టూర్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడిస్తే బాగుంటుంది. అలాగే రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి కుర్రాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది..
 

78

నేను సెలక్టర్‌ని అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ఐపీఎల్‌లో బాగా ఆడిన జితేశ్ శర్మ, రవి భిష్ణోయ్, హర్షిత్ రాణా, ఆకాశ్ మద్వాల్ వంటి ప్లేయర్లను సెలక్ట్ చేస్తాను..’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

88

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి హర్భజన్ సింగ్ ప్రకటించిన టీమ్ ఇది: శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, రవి భిష్ణోయ్, యజ్వేంద్ర చాహాల్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆకాశ్ మద్వాల్

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Recommended image2
PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే
Recommended image3
IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved