ఐదుగురు సూర్య కుమార్ యాదవ్లు, ఒక్క కోహ్లీ, ఓ వరల్డ్ కప్... రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున అదరగొట్టిన ఇద్దరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్. టీమిండియా 6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంటే వాటిల్లో చెరో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచారు సూర్య, విరాట్ కోహ్లీ... టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నారు ఈ ఇద్దరు...
Virat Kohli-Suryakumar Yadav
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ 6 మ్యాచులు ఆడి 98.67 సగటుతో 296 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 6 మ్యాచుల్లో 59.75 సగటుతో 239 పరుగులు చేశాడు ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఒంటి చేత్తో విజయాన్ని అందిస్తే... సౌతాఫ్రికాతో మ్యాచ్లో 64 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసి అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్, నెదర్లాండ్స్, జింబాబ్వేలతో జరిగిన మ్యాచుల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు...
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయ శతకం నమోదు చేశాడు. 217.65 స్ట్రైయిక్ రేటుతో బౌలర్లకు చుక్కలు చూపించాడు సూర్య. ఈ ఇన్నింగ్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...
Suryakumar Yadav
‘సూర్యకుమార్ యాదవ్లో టన్నుల్లో టాలెంట్ ఉంది. అతను ప్రపంచంలో ఏ మూలన అయినా పరుగులు రాబట్టగలడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఐదుగురు, ఒక్క విరాట్ కోహ్లీని ఇవ్వండి. నేను వరల్డ్ కప్ గెలిచి చూపిస్తా... ’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రికీ పాంటింగ్...
Image credit: PTI
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లపై ప్రశంసల వర్షం కురిపించిన రికీ పాంటింగ్, ‘నా దృష్టిలో విరాట్ కోహ్లీయే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. అతను ఆడిన ఇన్నింగ్స్లు అసాధారణం...’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్...
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ని ట్వీట్తో అభినందించాడు విరాట్ కోహ్లీ. ‘నుమెరో యూనో (స్పానిష్లో నెం.1 అని అర్థం) వరల్డ్లో తాను బెస్ట్ ఎందుకో మరోసారి చూపిస్తున్నాడు. లైవ్ మ్యాచ్ చూడలేదు కానీ అతని నుంచి మరో వీడియో గేమ్ ఇన్నింగ్స్ అని తెలుస్తోంది...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...