అతన్ని విడుదల చేయడం చాలా పెద్ద తప్పు... ఆర్సీబీ ప్లాన్ ఏంటో మరి!... గౌతమ్ గంభీర్ కామెంట్...
అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీని విమర్శించడానికి రెఢీ అయిపోతుంటాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. గత సీజన్లో ఆర్సీబీ, నాలుగో స్థానానికే పరిమితమైన తర్వాత... ‘విరాట్ కోహ్లీ కెప్టెన్గా పనికిరాడంటూ’ సంచలన వ్యాఖ్యాలు చేసిన గౌతీ, మరోసారి రాయల్ ఛాలెంజర్స్ను ట్రోల్ చేశాడు.
2021 ఐపీఎల్కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 10 మంది ఆటగాళ్లను వేలానికి విడుదల చేసిన విషయం తెలిసిందే...
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్తో పాటు క్రిస్ మోరిస్, మొయిన్ ఆలీ, ఇసురు ఉదాన, డేల్ స్టెయిన్, శివమ్ దూబే, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి, గురుకీరత్ మాన్, పార్థివ్ పటేల్ను జట్టు నుంచి తప్పించింది ఆర్సీబీ.
ఇందులో పార్థివ్ పటేల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోగా, డేల్ స్టెయిన్ ఈ ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్టు ప్రకటించాడు...
‘ఏ జట్టు అయినా విజయాలు దక్కించుకోవాలంటే, టైటిల్ గెలవాలంటే... ఆటగాళ్లపై నమ్మకం పెట్టాలి. ఒకే జట్టుతో ఆడిస్తూ ఉండాలి... ముంబై చేసేది అదే...
కానీ ఆర్సీబీ మాత్రం ప్రతీ సీజన్లోనూ జట్టులో భారీగా మార్పులు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రతీ ప్లేయర్ కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఇదే రాయల్ ఛాలెంజర్స్కి అతిపెద్ద సమస్య...
ఈ ఏడాది ఆర్సీబీ విడుదల చేసిన ప్లేయర్లలో క్రిస్ మోరిస్ పేరు ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అతన్ని వదులుకుని ఆర్సీబీ చాలా పెద్ద తప్పు చేసింది...
మోరిస్ లాంటి ఆల్రౌండర్ దక్కడం చాలా అరుదు. మినీ వేలంలో అలాంటి ఆల్రౌండర్ పొందడం కూడా కష్టమే...
కోల్కత్తా నైట్రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ గాయం కారణంగా గత ఏడాది ఐపీఎల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. అయినా అతన్ని అట్టిపెట్టుకుంది కేకేఆర్. ఎందుకంటే రస్సెల్ విలువ వారికి తెలుసు...
ఉమేశ్ యాదవ్ లాంటి సీనియర్ పేసర్ జట్టులో ఉంటే యువ బౌలర్లు రాణించడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. అతన్ని సరిగ్గా వాడుకోగలగడం తెలియాలి...
ఆర్సీబీ మాత్రం మోరిస్కి గాయం నుంచి కోలుకునే సమయం కూడా ఇవ్వకుండా జట్టు నుంచి తప్పించింది... అతని బదులు డైరెక్టర్ మైక్ హుసెన్, కోచ్ సైమన్ కటిచ్లను తొలగించాల్సింది... ’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.
గత ఏడాది ఐపీఎల్లో పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయిన ఆసీస్ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్, పేసర్ మిచెల్ స్టార్క్లను ఆర్సీబీ కొనుగోలు చేయాలని సూచించాడు గంభీర్.