MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సెమీస్‌కు చేరే జట్లు అవే.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడి కామెంట్స్.. మాజీ సెమీఫైనలిస్టులకు చాన్స్ ఇవ్వని దాదా

సెమీస్‌కు చేరే జట్లు అవే.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడి కామెంట్స్.. మాజీ సెమీఫైనలిస్టులకు చాన్స్ ఇవ్వని దాదా

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్  కు చేరే నాలుగు జట్లు ఏవనే విషయంపై  మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా  చేరాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Oct 23 2022, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన  టీ20 ప్రపంచకప్ లో  ఆరంభమే అదిరింది. తొలి రోజు న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా మధ్య హై స్కోరింగ్ గేమ్ లో ఆసీస్  ఓడింది. ఇంగ్లాండ్-అఫ్గాన్ మధ్య   ముగిసిన లో స్కోరింగ్ గేమ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 

27

మరి  ఈ మెగా టోర్నీలో  సెమీస్ కు చేరే నాలుగు జట్లు ఏవి..? అనే విషయంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  ఈ జాబితాలో  బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరాడు.  తాజాగా గంగూలీ.. ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్లను తేల్చేశాడు. 

37

దాదా మాట్లాడుతూ.. ‘నా  దృష్టిలో  టీ20 ప్రపంచకప్ - 2022లో సెమీస్ చేరే జట్లు ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా..  సౌతాఫ్రికాకు బౌలింగ్ బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో అదే  అత్యంత కీలకం..’ అని తెలిపాడు. 
 

47

ఇక భారత జట్టు గతేడాదితో పాటు అంతకుముందు టీ20 ప్రపంచకప్ లలో  అనుకున్న స్థాయిలో రాణించకపోయినా ఈసారి మాత్రం ఫేవరేట్లలో ఒకటిగా ఉంటుందని దాదా చెప్పాడు.  గతం గురించి చర్చించాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు జట్టు బలంగా ఉందని  అన్నాడు. 

57

‘గతంలో ఏం జరిగిందనేదానిమీద ఇప్పుడు  చర్చ జరపడం  సరికాదు. ఈ టోర్నీలో భారత జట్టు కచ్చితంగా ఫేవరేట్. ఇతర మ్యాచ్ లతో పోలిస్తే ప్రపంచకప్ ఆడటం   భిన్నంగా ఉంటుంది. ఆ రెండు, మూడు వారాలు  సరైన ప్రదర్శనలు చేసిన జట్టే విజేతగా నిలుస్తుంది. 
 

67

అయితే ఈ టోర్నీలో ఫైనల్ చేరే జట్టు ఏది..?  విజేతగా నిలిచేది ఎవరు అనేది చెప్పడం కష్టం.  టీ20 అనేది  మ్యాచ్ జరిగిన  నాలుగు గంటలు  ఫామ్ కీలకం. అలా చూసుకుంటే మన జట్టులో మంచి హిట్టర్లు, అనుభవం కలిగిన ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది..’ అని దాదా తెలిపాడు. 

77

అయితే సెమీస్ లో  నాలుగు జట్లను ఎంపిక చేసిన దాదా  కామెంట్స్ పై  పాకిస్తాన్, న్యూజిలాండ్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు.  ఈ రెండు జట్లు గతేడాది ప్రపంచకప్ లో సెమీస్ చేరినవే. న్యూజిలాండ్ అయితే ఫైనల్ కూడా ఆడింది. కానీ ఈ రెండు జట్లు దాదా  అంచనా వేసిన సెమీఫైనలిస్టుల జాబితాలో లేవు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image2
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Recommended image3
IND vs ENG : మనోడి అరాచకం.. వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ అసలైన ఫైట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved