MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • MS Dhoni: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ధోని పై బీహార్ లో చెక్ బౌన్స్ కేసు

MS Dhoni: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ధోని పై బీహార్ లో చెక్ బౌన్స్ కేసు

FIR filed against MSD: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను ధోనికి ఈ చిక్కులు వచ్చాయి.  

1 Min read
Srinivas M
Published : Jun 01 2022, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చెన్నై సూపర్ కింగ్స్ సారథి  మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన ధోని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు  బీహార్ లోని బెగుసరాయ్ పోలీసులు. 

26

అసలేం జరిగిందంటే.. ధోని భారత జట్టుకు సారథిగా ఉన్నప్పుడు అతడు బీహార్ కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా వ్యవహరించాడు. ఇది ఒక ఎరువులు తయారీ చేసే సంస్థ. 

36

సదరు సంస్థ.. ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే మరో సంస్థకు రూ. 30 లక్షలు విలువ చేసే ఎరువులు సరఫరా చేసింది. అయితే ఈ వ్యవహారంలో డీలర్ తాము ముందు కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోలేదని..  దాని వల్ల తాము కొనుగోలు చేసిన ఎరువులు అలాగే అమ్ముడుపోకుండా  ఉండిపోయాయని ఆరోపించింది. 

46

అయితే  న్యూఇండియా గ్లోబర్ ప్రొడ్యూస్ సంస్థ.. బాధిత సంస్థ నుంచి తిరిగి ఆ ఎరువులను తీసుకుంది. బదులుగా వాళ్లకు రూ. 30 లక్షలు విలువ చేసే చెక్ ను  ఇచ్చింది. 

56
<p>MS Dhoni</p>

<p>MS Dhoni</p>

ఆ చెక్ ను బ్యాంక్ లో వేసుకున్నా అందులో డబ్బులు లేక అది కాస్తా బౌన్స్ అయింది. దీంతో షాక్ తిన్న ఎస్కే ఎంటర్ ప్రైజెస్..  ధోని ప్రమోట్ చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు పంపింది.కానీ వాళ్లకు న్యూఇండియా సంస్థ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఎస్కే ఎంటర్ప్రైజెస్ ఓనర్ నీరజ్ కుమార్ నిరల.. న్యూఇండియా సంస్థతో పాటు ధోని పై  కూడా కేసు నమోదు చేశాడు.  ఏడుగురి పేరును ఎఫ్ఐఆర్ లో జతపరిచాడు.  

66

ఇటీవలే బెగుసరాయ్ లోని వినయోగదారుల ఫోరం కోర్టు లో ఈ కేసును  విచారించిన న్యాయమూర్తి..  దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ మిశ్రాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ కేసు తిరిగి  జూన్ 28న విచారణ కు రానున్నది. 

About the Author

SM
Srinivas M
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Recommended image2
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !
Recommended image3
IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved