కోహ్లీది గొప్ప నిర్ణయం... కుటుంబమే ఆ సమయాల్లో అండగా ఉంటుంది... సురేశ్ రైనా కామెంట్...
భారత సారథి విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకుని, ప్రసవ సమయంలో భార్య అనుష్క శర్మకు తోడుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆసీస్ టూర్ మధ్యలో స్వదేశానికి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీపై కొందరు మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపించారు. ‘క్రికెట్ కంటే ఏదీ ఎక్కువ కాదని... చిన్న చిన్న కారణాలతో జట్టుకు దూరం కావడం కరెక్టు కాదని’ కామెంట్ చేశారు. అయితే సురేశ్ రైనా మాత్రం కోహ్లీకి సపోర్టు చేశాడు.
భార్యకు తోడుగా ఉండాలని నిర్ణయించుకుని భారత సారథి విరాట్ కోహ్లీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...
‘అది అతని వ్యక్తిగత నిర్ణయం... ప్రసవ సమయంలో భార్య అనుష్క శర్మకు తోడుగా ఉండాల్సిన విరాట్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది...
నాకు కూతురు పుట్టినప్పుడు కూడా నేను ఇదే పని చేశాను... ఎందుకంటే కుటుంబం కంటే ఏదీ గొప్పది కాదు...
ఈ రోజు ఆట నీతో ఉండొచ్చు. నీ ఆట చూసి ప్రపంచం ఆకాశానికి ఎత్తేయొచ్చు. కానీ రేపటి రోజున ఏదీ ఉండదు. ఆటకి దూరమైనప్పుడు తోడుగా ఉండేది కుటుంబం మాత్రమే...
నీ కుటుంబానికి, నీ భార్యకి నీ అవసరం ఉన్నప్పుడు... నువ్వు అక్కడ ఉండాలి... దాని కోసం ఏం చేసినా తప్పు కాదు...
ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు... నిజానికి అదే కరెక్టు..
ఈ కరోనా విపత్తు సమయంలో మన కుటుంబానికి మన అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రసవ సమయంలో భార్యకు దూరంగా గడపడం చాలా బాధకరమైన విషయం...
ఆ ఆలోచనలతో జట్టుకి కూడా సరిగా ఆడలేం... విరాట్ కోహ్లీ దేశం కోసం చాలా చేశాడు... ఇప్పుడు తన కోసం జీవించడంలో తప్పు లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు సురేశ్ రైనా.
ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు సురేశ్ రైనా మామగారి ఇంటిపై దాడి చేసిన దుండగులు, ఆయన్ని హత్య చేశారు...
ఈ దుర్ఘటన తర్వాత స్వదేశం చేరుకున్న సురేశ్ రైనా, భార్యకి, కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుని, ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు....