MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌కు మరో చారిత్రాత్మక గుర్తింపు.. ఐపీఎల్‌లో వెయ్యో మ్యాచ్‌లో తలపడబోతున్న దిగ్గజ టీమ్స్

‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌కు మరో చారిత్రాత్మక గుర్తింపు.. ఐపీఎల్‌లో వెయ్యో మ్యాచ్‌లో తలపడబోతున్న దిగ్గజ టీమ్స్

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్  మార్చి 31న మొదలుకానుంది.  ఈ మేరకు  శుక్రవారం  అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ  సీజన్ మరో మైలురాయికి  చేరువకాబోతుంది. 

2 Min read
Author : Srinivas M
Published : Feb 18 2023, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్‌లో  16వ సీజన్  జోష్ మొదలైంది.  శుక్రవారం  ఐపీఎల్-16 షెడ్యూల్ ను  బీసీసీఐ బ్రాడ్ కాస్టర్  స్టార్ స్పోర్ట్స్, జియో టీవీలలో నిన్న (శనివారం) ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా మొదలైన విషయం తెలిసిందే.   మార్చి 31 న మొదలై మే 28 వరకూ సాగే ఈ టోర్నీలో  తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్  వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగనుంది. 

26

15 ఏండ్లుగా భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తున్న  ఈ లీగ్ 2023వ సీజన్ లో  మరో మైలురాయిని చేరుకోబోతున్నది. 16వ సీజన్ లో ఈ లీగ్ లో వెయ్యో మ్యాచ్ జరుగనుంది.   మే 06న   ఐపీఎల్ లో ఈ అరుదైన మైలురాయిని చేరుకుంటుంది. 

36

యాధృశ్చికమో  లేక మరేదో గానీ ఈ  ప్రతిష్టాత్మక మైలురాయి రెండు దిగ్గజ జట్ల మధ్యనే జరుగుతుండటం విశేషం.  ఐపీఎల్ లో మోస్టగ్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్యే జరుగుతుండటం గమనార్హం.  మే 06న  చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబై - చెన్నై మధ్య  వెయ్యో మ్యాచ్ జరగాల్సి ఉంది. 

46

ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లను ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు.  మిగతా జట్లు ఎన్ని మ్యాచ్ లు ఆడినా  ఎంత ఉత్కంఠతో కూడిన  ఆట ఆడినా   ముంబై-చెన్నై మధ్య జరిగే మ్యాచ్ లకు ఉండే క్రేజ్ రాదు.  ఐపీఎల్ లో ఇప్పటివరకూ 15 సీజన్లు ముగిస్తే అందులో తొమ్మిది.. చెన్నై నాలుగు, ముంబై ఐదు టైటిల్స్ తో ముందున్నాయి.  

56

ఇక ఈ రెండు దిగ్గజ జట్లమధ్య ద  నాలుగు సార్లు ఫైనల్స్ జరిగాయి.  2010, 2013, 2015, 2019 లలో ముంబై - చెన్నై ఫైనల్స్ లో తలపడ్డాయి.  2010లో చెన్నై విజయం సాధించగా తర్వాత  మూడు సార్లూ ముంబైదే విజయం.  కానీ గత సీజన్ లో ఈ రెండు జట్లూ  పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి.  మరి ఈ సీజన్ లో ఏం చేస్తాయో చూడాలి.   

66

చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్ లో ఇదే ఆఖరి సీజన్.  2008 నుంచి  చెన్నైకి సారథిగా వ్యవహరిస్తున్న ధోని..  వాస్తవానికి గతేడాదే ఈ లీగ్ కు గుడ్ బై చెప్పాలని చూశాడు.   అదే క్రమంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చినా  అతడు  టీమ్ ను విజయవంతంగా నడిపించలేదు. దీంతో మళ్లీ టోర్నీ మధ్యలోనే  ధోని సారథ్య పగ్గాలు అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో చెన్నై చతికిలపడింది. ఈ సీజన్ లో ధోనికి ఫేర్వెల్ ఇవ్వడానికి ఆ జట్టు గట్టిగానే ప్రిపేర్ అయి వస్తున్నట్టు తెలుస్తున్నది. 
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA : మరో ఫైనల్ రేంజ్ ఫైట్.. రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్
Recommended image2
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Recommended image3
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved