ఎవరు వచ్చినా, రాకపోయినా ఐపీఎల్ 2021 పూర్తిచేసి తీరతాం... బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా..
ఎన్నడూ లేనట్టుగా ఐపీఎల్ 2021 సీజన్కి మధ్యలోనే బ్రేకులు పడ్డాయి. అయితే సమ్మర్ సీజన్ కాస్తా వృథా అయిపోవడంతో తిరిగి ఐపీఎల్ మ్యాచులు నిర్వహించినప్పుడు ఫారిన్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఎవరు వచ్చినా, రాకపోయినా ఐపీఎల్ పూర్తిచేసి తీరతామని అంటున్నాడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో యూఏఈలో నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. గత సీజన్ కూడా ఇదే సమయంలో జరిగింది. అయితే అప్పుడే ప్రపంచమంతా లాక్డౌన్ ఉండడంతో క్రికెటర్లు ఖాళీగా ఉన్నారు.
ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్ నడుస్తున్న సమయంలో వేరే సిరీస్ల్లో ఆడుతున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల క్రికెటర్లు, మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని తేల్చి చెప్పేశారు.
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభమవుతుండడంతో విండీస్ ప్లేయర్లు కడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉంటారా? లేదా? అనేది ఇంకా తేలలేదు.
అయితే ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను విజయవంతంగా పూర్తిచేసేందుకు వివిధ దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతోంది బీసీసీఐ. విండీస్ బోర్డుతో చర్చించి, సీపీఎల్ను కూడా వాయిదా వేయించాలని చూస్తోంది.
‘ఐపీఎల్ 2021 సీజన్ గురించి జరిగిన మీటింగ్లో మేం విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉంటారా? లేదా? అనే విషయం గురించి చర్చించాం. అయితే ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం ఐపీఎల్ను పూర్తిచేయడం...
సగంలో ఆపివేసిన సీజన్ను ఎలాగైనా పూర్తిచేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాం. కాబట్టి ఎవరు వచ్చినా, రాకపోయినా సీజన్ జరుగుతుంది. ఏ దేశబోర్డు తమ ప్లేయర్లను ఐపీఎల్కు పంపకపోయినా లీగ్ మాత్రం ఆగకూడదని నిర్ణయించుకున్నాం.
ఐపీఎల్ ఫ్రాంఛైజీల దగ్గర కావాల్సినంత మంది భారత ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. కొందరు ఫారిన్ ప్లేయర్లు రాకపోతే వారి స్థానంలో మరికొందరిని ఆడించేందుకు అవకాశం కూడా ఉంది.
కాబట్టి ఫ్రాంఛైజీలు ఖాళీగా ఉన్న ఫారిన్ ప్లేయర్లను ఆడించేందుకు చూస్తాయి. అందుబాటులో ఉన్న విదేశీ ప్లేయర్లతోనే సీజన్ను ముగిస్తాం. ఇప్పటికైతే ఇదే మా పాలసీ...’ అంటూ ప్రకటించాడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.
‘ఐపీఎల్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించాలా? లేదా? అనేది తేలాల్సి ఉంది. దాన్ని నిర్ణయించడానికే యూఏఈకి వెళ్లి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాం. జనాలు వచ్చినా, రాకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.’ అంటూ చెప్పాడు రాజీవ్ శుక్లా.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా సెప్టెంబర్ 19 నుంచి పార్ట్ 2 మొదలుకావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు రాజీవ్ శుక్లా.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు తమ ప్లేయర్లను పంపేందుకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికీ అంగీకరించింది. కాబట్టి క్రిస్ మోరిస్, రబాడా, నోకియా, డుప్లిసిస్, డి కాక్ వంటి ప్లేయర్లు మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉంటారు.
ఆస్ట్రేలియా కూడా టీ20 వరల్డ్కప్ ముందు ప్రాక్టీస్గా ఐపీఎల్ 2021 సీజన్ని చూస్తామని స్పష్టం చేసింది. అయితే ఐపీఎల్కి వెళ్తారా? లేదా? అనేది ఆటగాళ్ల ఇష్టానికి వదిలేస్తున్నట్టు ప్రకటించింది. కేకేఆర్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్, తాను ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని స్పష్టం చేశాడు.