చెన్నై సూపర్ కింగ్స్కి రాబిన్ ఊతప్ప... క్యాష్ డీల్ చేసుకున్న రాజస్థాన్...
యంగ్ ప్లేయర్ల కంటే అనుభవం ఉన్న ప్లేయర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ధోనీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి కూడా అదే వ్యూహం అనుసరించబోతున్నట్టు తెలుస్తోంది.
గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ప్రాతినిథ్యం వహించిన భారత సీనియర్ ప్లేయర్ రాబిన్ ఊతప్పను, ఆల్ క్యాష్ డీల్ ఒప్పందం ప్రకారం సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
ఈ ఒప్పందం ప్రకారం రాబిన్ ఊతప్పకి రూ.3 కోట్లు చెల్లించనుంది సీఎస్కే.
ఊతప్పను కొనుగోలు చేసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో 19.2 కోట్ల రూపాయాలు ఉన్నాయి.
రాబిన్ ఊతప్పకి సీఎస్కే ఆరో ఐపీఎల్ జట్టు. అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన ముంబై, చెన్నైల తరుపున ఆడబోతున్న అతి కొద్ది మంది ప్లేయర్లలో ఊతప్ప ఒకడు.
గత రెండు సీజన్లలో 200 పరుగులు చేసినా, 120 కంటే తక్కువ స్టైయిక్ రేటు ఉన్న ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. అతనితో పాటు కేదార్ జాదవ్, అంబటి రాయుడు, ఆరోన్ ఫించ్, విజయ్ శంకర్... ఈ లిస్టులో ఉన్నారు.
2008లో ముంబై, 2009,10లో ఆర్సీబీ, 2011లో పూణే, 2014 నుంచి 1019 దాకా కోల్కత్తా నైట్రైడర్స్ జట్టుకు ఆడిన ఊతప్ప, 2021లో చెన్నైకి ఆడబోతున్నాడు.
గత సీజన్లలో ఓల్డ్ ఏజ్ హోం జట్టుగా పేరొందిన సీఎస్కే... ఈ ఏడాది ఆ మార్కును తొలగించుకోవాలని ప్రయత్నిస్తుందని అనుకున్నారంతా.
‘గత ఏడాది సీజన్ ప్రారంభంలో మా జట్టులో చాలా మంది రిటైర్ అయిన ప్లేయర్లు ఉన్నారు... సీనియర్ సిటిజన్ జట్టు అని అందరూ అంటున్నారు...’ అని ఒప్పుకున్నాడు సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...
గత ఏడాది ఘోరంగా విఫలమైన మురళీ విజయ్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, షేన్ వాట్సన్లను మినీ వేలానికి ముందు విడుదల చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
మూడు సీజన్లుగా అట్టి పెట్టుకున్నా ఒక్క సీజన్లో కూడా సరిగ్గా అవకాశం ఇవ్వని మోను కూమార్ని కూడా వేలానికి వదిలేసింది. వీరి స్థానంలో యువకులను తీసుకుంటారని ఆశపడిన ఫ్యాన్స్, రాబిన్ ఊతప్పను తీసుకోవడంతో షాక్ అయ్యారు.
ఐపీఎల్లో రాబిన్ ఊతప్ప ఆడిన జట్లు, ఎక్కువ పరాజయాలను ఎదుర్కొన్నాయి. ఊతప్ప ఐపీఎల్ మ్యాచుల్లో అత్యధిక శాతం ఓడిన జట్ల వైపు. అలాంటి ఊతప్పను రూ.3 కోట్లు పెట్టి కొనడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు సీఎస్కే అభిమానులు.