భార్య వెంటే ఉండాలని విరాట్ కోహ్లీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి...
INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభం నుంచి అందరూ చర్చించుకుంటున్న విషయం ఒకటే విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్.... ఆస్ట్రేలియాలాంటి పటిష్ట జట్టుపై, అదీ కూడా ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లీ ఒకే టెస్టు ఆడి, స్వదేశానికి వస్తుండడంపై ఒక్కోరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ లేకపోతే భారత జట్టు కొందరు అంచనా వేస్తుంటే... విరాట్ కోహ్లీ లేకపోతేనే టీమిండియా ప్లేయర్లు మరింత మెరుగ్గా ప్రదర్శన ఇస్తారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, వచ్చే ఏడాది జనవరి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత ఆసీస్ టూర్కి కూడా భార్యను వెంటతీసుకెళ్లాలని భావించిన కోహ్లీ, కరోనా నిబంధనల కారణంగా నిర్ణయం మార్చుకున్నాడు.రు.
డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే మొదటి పింక్ బాల్ టెస్టు ముగిసిన తర్వాత భార్యకు తోడుగా ఉండేందుకు స్వదేశానికి తిరిగి రానున్నాడు విరాట్ కోహ్లీ... స్వదేశం చేరుకున్నాక క్వారంటైన్ పూర్తిచేసుకుని అనుష్కకు తోడుగా ఉండనున్నాడు కోహ్లీ.
ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని కొనియాడాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి...
‘గడిచిన ఐదేళ్లలో భారత జట్టు అద్భుత విజయాలు అందుకుని, టాప్ టీమ్గా ఎదిగింది... ఈ విజయాల వెనక విరాట్ కోహ్లీ ఉన్నాడు... తాను బ్యాటింగ్లో రాణిస్తూ... జట్టును ముందుండి నడిపిస్తున్నాడు కోహ్లీ...
విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్, కెప్టెన్ను ఆస్ట్రేలియా సిరీస్లో కచ్ఛితంగా మిస్ అవుతాం... అయితే వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను దగ్గరుండి ఆస్వాదించాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది...
తొలి సంతానం కలిగినప్పుడు ఇచ్చే ఫీలింగ్ వేరు... స్వదేశానికి వెళుతున్నందుకు అతను చాలా సంతోషంగా ఉన్నాడని అనుకుంటున్నా... విరాట్ కోహ్లీ గైర్హజరీతో యువ ఆటగాళ్లకు మంచి ఛాన్స్ దక్కుతుంది...’ అని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి...
విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే... రవిశాస్త్రితో ఉన్న అటాచ్మెంట్ కారణంగానే రెండోసారి కూడా కోచ్గా అతన్నే నియమించింది బీసీసీఐ...
అయితే గత వన్డే వరల్డ్కప్లో మద్యం మత్తులో తులుతూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు రవిశాస్త్రి... ఆ తర్వాత కోచ్ రవిశాస్త్రిపై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి, వస్తున్నాయి.
14 రోజుల క్వారంటైన్ నిబంధన గనక లేకపోయి ఉంటే... విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాకి తిరిగి వచ్చి నాలుగో టెస్టు కూడా ఆడేవాడని చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. కరోనా నియమాల కారణంగా ఒకే టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడని తెలిపాడు.