రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఊరట... కరోనా నుంచి కోలుకున్న యంగ్ ఓపెనర్..
ఐపీఎల్ 2021 సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆర్సీబీ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిజల్డ్ వచ్చింది.
నెగిటివ్ రిజల్డ్ వచ్చినప్పటికీ మిగిలిన ప్లేయర్ల భద్రత దృష్ట్యా కరోనా ప్రోటోకాల్ ప్రకారం దేవ్దత్ పడిక్కల్, వారం రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది...
మార్చి 22న నిర్వహించిన పరీక్షల్లో దేవ్దత్ పడిక్కల్కి కరోనా పాజిటివ్ రాగా, అప్పటి నుంచి ఐసోలేషన్లో ఉన్నాడు ఈ యంగ్ ఓపెనర్.
కరోనా నిబంధనల కారణంగా ఆర్సీబీ ఆడే మొదటి మ్యాచ్లో దేవ్దత్ పడిక్కల్ ఆడే అవకాశం లేదు. అతని స్థానంలో విరాట్ కోహ్లీతో పాటు యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇంగ్లాండ్తో ఆఖరి టీ20లో ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్లో కూడా ఓపెనింగ్ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడనుంది ఆర్సీబీ...
గత సీజన్లో ఆరంగ్రేటం చేసిన దేవ్దత్ పడిక్కల్, ఐదు హాఫ్ సెంచరీలతో 480కి పైగా రన్స్ సాధించి, 2020 ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ప్లేయర్గా నిలిచాడు...
విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలతో 700లకు పైగా పరుగులు చేసిన దేవ్దత్ పడిక్కల్, పృథ్వీషా తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న దేవ్దత్ పడిక్కల్పై భారీ ఆశలే పెట్టుకుంది ఆర్సీబీ...