టీమిండియా ఫిట్నెస్కి కొత్త పరీక్ష... పోలీసు ఫిజికల్ టెస్టు కంటే కఠినంగా యో-యో టెస్టు...
ఆస్ట్రేలియా టూర్లో ప్రత్యర్థి జట్టు కంటే ఎక్కువగా గాయాలు, టీమిండియాను తెగ ఇబ్బంది పెట్టాయి. దీంతో క్రికెటర్ల ఫిట్నెస్ పెంచేందుకు యో-యో టెస్టులో భారీగా మార్పులు చేసింది బీసీసీఐ.
నాలుగు టెస్టుల సిరీస్లో ఏకంగా ఏడుగురు ప్లేయర్లు గాయం కారణంగా సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకోగా మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ గాయాలతో ఇబ్బందిపడ్డారు.
దీంతో క్రికెటర్ల ఫిట్నెస్ పెంచేందుకు యో-యో టెస్టులో భారీగా మార్పులు చేసింది బీసీసీఐ.
భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఏ ఆటగాడికైనా యో-యో టెస్టు పాస్ కావడం తప్పనిసరి. ఎనిమిదేళ్ల క్రితం రిటైరైన సచిన్ టెండూల్కర్ ఆడుతున్నప్పటి నుంచే ఈ నియమం అమలులో ఉంది.
వీరేంద్ర సెహ్వాగ్ లాంటి క్రికెటర్లు ఈ యోయో పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించినా, బీసీసీఐ రూల్స్ కారణంగా జట్టులో చోటు కూడా కోల్పోవాల్సి వచ్చింది...
ఇప్పుడు తాజాగా ఆసీస్ టూర్లో ఎదురైన అనుభవం దృష్ట్యా, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా యోయో పరీక్షను మరింత కఠినతరం చేసింది బీసీసీఐ...
సాధారణంగా భారత క్రికెటర్లకు నిర్వహించే యో- యో టెస్టులో ఏ ప్లేయర్ అయినా 17.1 పాయింట్లు సాధిస్తే చాలు... అయితే ఇప్పుడు ఆటగాడి వేగానికి, సహనానికి కూడా పరీక్ష పెట్టనుంది బీసీసీఐ...
భారత జట్టులో పేసర్గా కొనసాగాలంటే 8 నిమిషాల 15 సెకన్లలో 2 కి.మీ.ల లక్ష్యాన్ని పరుగెత్తాల్సి ఉంటుంది...
వికెట్ల మధ్య పరుగెత్తే బ్యాట్స్మెన్ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో ఈ 2 కిలోమీటర్ల టార్గెట్ను పరుగెత్తాలి...
ఏదో ఒక్కసారి యోయో టెస్టు పాస్ అయితే సరిపోతుందని కాదు... ఏడాదికి మూడు సార్లు ఈ టెస్టును ఆటగాళ్లు పూర్తిచేయాల్సి ఉంటుంది...
నిజానికి పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలు కూడా ఇంత కఠినంగా ఉండవు. వారికి 5 కి.మీ.ల లక్ష్యాన్ని 25 నిమిషాల్లో పరుగెత్తే ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు ఉండేది... అయితే ఇప్పుడు దాన్ని కూడా తొలగించారు.
ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్స్కే 2 కి.మీ.ల పూర్తిచేసేందుకు 6 నిమిషాల 15 సెకన్ల సమయం ఉంటుంది.
అలాంటిది భారత క్రికెటర్లకు ఇంత కఠినంగా ఫిట్నెస్ టెస్టులు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా చేస్తే చాలామంది టాలెంటెడ్ క్రికెటర్లు జట్టుకి దూరం కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
కొత్త ఫిట్నెస్ టెస్టును వచ్చే నెల నుంచి ప్రారంభించాలని... ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్ నెలల్లో ఆటగాళ్లకు యో-యో టెస్టు పెట్టాలనే ఆలోచన చేస్తోందట బీసీసీఐ...
గాయపడి జట్టుకి దూరమైన ప్లేయర్లు కూడా మళ్లీ జట్టులోకి రావాలంటే ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది...
ప్రస్తుతం భారత జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, బుమ్రా, ఉమేశ్ యాదవ్, నవ్దీప్ సైనీలకు సిక్స్ బాడీ ఉంది...
అయితే సరిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ, పృథ్వీషా లాంటి వారికే ఈ యో-యో టెస్టు పాస్ కావడం చాలా పెద్ద సమస్యగా మారనుంది.