ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్... మొదటి రెండు టెస్టులకి భారత జట్టు ఎంపిక... విరాట్, ఇషాంత్ రీఎంట్రీ...
ఆస్ట్రేలియా టూర్లో అద్భుత విజయంతో ముగించిన టీమిండియా... వచ్చే నెల స్వదేశంలో ఇంగ్లాండ్తో సుదీర్ఘమైన సిరీస్ ఆడబోతోంది. ఇంగ్లాండ్తో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే 4 మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొదటి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఆడబోయే ఈ రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేసింది.
భారత రెగ్యూలర్ సారథి విరాట్ కోహ్లీతో పాటు గాయం కారణంగా టెస్టు సిరీస్కి దూరమైన ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇచ్చారు...
టెస్టు సిరీస్లో పాల్గొనని ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్పిన్నర్ అక్షర్ పటేల్లకు అదనంగా జట్టులో చోటు దక్కింది.
మొదటి టెస్టులో ఘోరంగా ఫెయిలైన పృథ్వీషాని పక్కనబెట్టిన బీసీసీఐ, మయాంక్ అగర్వాల్కి మరో అవకాశం ఇచ్చింది.
బుమ్రాకి మొదటి రెండు టెస్టుల్లో విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగినా అతను జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
మూడో టెస్టులో గాయపడిన రవీంద్ర జడేజాతో పాటు హనుమ విహారి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో వీరికి విశ్రాంతి కల్పించింది బీసీసీఐ...
అలాగే మొదటి టెస్టులో గాయపడిన మహ్మద్ షమీ, రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్లకు కూడా విశ్రాంతి కల్పించారు...
గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో సత్తా చాటుతున్న భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను బీసీసీఐ పట్టించుకోలేదు...
అలాగే టెస్టులకు దూరమైన శిఖర్ ధావన్కి కూడా స్వదేశంలో సిరీస్కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు...
ఆఖరి టెస్టులో ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు తీసిన నటరాజన్కి కూడా మొదటి రెండు టెస్టులకి పక్కన పెట్టింది టీమిండియా...
మొదటి రెండు టెస్టులకు భారత జట్టు ఇది...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
నెట్బౌలర్లకు కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. అంకిత్ రాజ్పుత్, అన్వేష్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరబ్ కుమార్ మొదటి రెండు టెస్టులకు నెట్ బౌలర్గా ఉంటారు.
అలాగే స్టాండ్ బౌ ప్లేయర్లుగా కూడా కొందరు కుర్రాళ్లను ఎంపిక చేశారు సెలక్టర్లు. కెఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, షాబజ్ నదీమ్, రాహుల్ చాహార్, ప్రియాంక్ పంచల్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.