MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • శ్రీలంక సిరీస్‌లో మార్పులు చేసిన బీసీసీఐ... విరాట్ కోహ్లీకి ఆ కాస్త సంతోషం కూడా మిగలకుండా ఉండేందుకు...

శ్రీలంక సిరీస్‌లో మార్పులు చేసిన బీసీసీఐ... విరాట్ కోహ్లీకి ఆ కాస్త సంతోషం కూడా మిగలకుండా ఉండేందుకు...

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమవుతున్న భారత జట్టు, ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో కలిసి టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థనతో ఈ సిరీస్‌లో కొన్ని మార్పులు చేసింది భారత క్రికెట్ బోర్డు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 15 2022, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

షెడ్యూల్ ప్రకారం శ్రీలంక, భారత్‌కి చేరుకున్న తర్వాత రెండు టెస్టులు ఆడి, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే తొలుత టీ20 సిరీస్ నిర్వహించాల్సిందిగా బీసీసీఐని కోరింది లంక క్రికెట్ బోర్డు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

లంక బోర్డు అభ్యర్థనను ఆమోదించిన భారత క్రికెట్ బోర్డు, లంక సిరీస్‌లో కొన్ని మార్పులు చేసింది. ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో లంక తొలుత టీ20 సిరీస్‌ ఆడి, టెస్టు సిరీస్ ఆడుతుంది...

310

ఫిబ్రవరి 4న లక్నోలో మొదటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత 26న రెండో టీ20, 27న మూడో టీ20 మ్యాచ్‌లు ధర్మశాల వేదికగా జరుగుతాయి...

410

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా తొలి టెస్టు ప్రారంభమవుతుంది. బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది...

510

బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే రెండో టెస్టును డే- నైట్ టెస్టుగా నిర్వహించబోతున్నట్టు అధికారికంగా ఖరారు చేసింది భారత క్రికెట్ బోర్డు...

610

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆడే విరాట్ కోహ్లీ, బెంగళూరు జనాలకు చేరువయ్యాడు. ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, వందో టెస్టు మ్యాచ్‌ బెంగళూరు వేదికగా జరుగుతుందని భావించారు అభిమానులు...

710

అయితే బీసీసీఐ మాత్రం తొలి టెస్టును మొహాలీ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురుకానుంది...

810

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తొలగించి, కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడానికి కూడా కారణమైన బీసీసీఐ, విరాట్‌కి అన్ని విధాలుగా చెక్ పెట్టేందుకు టెస్టు వేదికలను మార్చిందని అంటున్నారు అభిమానులు...

910

అయితే సిక్కు కుటుంబానికి చెందిన విరాట్ కోహ్లీ, ఢిల్లీలో పుట్టి పెరిగినా.. మొహాలీలో 100వ టెస్టు మ్యాచ్ ఆడడమంటే సొంత మైదానంలో ఆడినట్టే కదా అంటున్నారు మరికొందరు అభిమానులు... అదీ కాక మొహాలీలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది.

1010

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో కలిసి 26 పరుగులు మాత్రమే చేసి, తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved