ఆరు నగరాల్లో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ... జనవరి 10 నుంచి స్వదేశీ టీ20 సిరీస్...
ఏడు నెలల గ్యాప్ తర్వాత దేశవాళీ క్రికెట్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీతో దేశీయ క్రికెట్ సీజన్ మొదలు కాబోతోంది. బయో బబుల్ నిబంధనల నడుమ జరిగే ఈ టోర్నీ కోసం ఆరు నగరాలను ఎంచుకుంది బీసీసీఐ. ఆటగాళ్లు, సిబ్బంది వసతి కోసం ఫైవ్ స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సీజన్ జరగనుంది.
బెంగళూరు, కోల్కత్తా, వడోదర, ఇండోర్, చెన్నై, ముంబై వేదికలుగా జనవరి 10 నుంచి 31 వరకూ సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ జరగనుంది.
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 38 సీనియర్ జట్లు ఐదు గ్రూపులుగా విడిపోయి... టైటిల్ కోసం పోరాడతాయి...
ఏ, బీ, సీ, డీ, ఈ, ఓ ప్లేట్ గ్రూప్ మధ్య గ్రూప్ స్టేజ్లో మ్యాచులు జరుగుతాయి...
ప్లేట్ గ్రూప్లో కొత్త జట్లు ఛండీఘర్, బీహార్, నార్త్ ఈస్ట్ రీజన్ పోటీపడతాయి...
కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ ముంబయిని టీ20 టోర్నీకి వేదికగా ఎంచుకుంది బీసీసీఐ..
ముంబైలో ఇప్పటిదాకా అవుట్ డోర్ గేమ్స్కి అనుమతి లభించలేదు. మరి వచ్చే నెలలో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీకి అనుమతి వస్తుందా? అనేది అనుమానంగా మారింది...
వచ్చే ఐపీఎల్ సీజన్లో అదనంగా రెండు జట్లను చేర్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీసీఐ...
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ సీజన్లో మంచి ప్రదర్శన ఇచ్చిన యువ క్రికెటర్లకి ఐపీఎల్ మెగా వేలంలో మంచి ధర లభించే అవకాశం ఉంటుంది...
ఇప్పటికే క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, బ్యాన్ నుంచి బయటపడ్డ శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు...