బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు విడుదల... రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు మాత్రమే...
భారత క్రికెట్ బోర్డు పురుషుల క్రికెటర్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్కు సంబంధించిన లిస్టును విడుదల చేసింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా కేవలం ముగ్గురు ప్లేయర్లకు మాత్రమే A+ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది....
భారత సారథి విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలకు బీసీసీఐ గ్రేడ్ A+కాంట్రాక్ట్ లభించింది.
మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీతో పాటు స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్, స్టార్ పేసర్ బుమ్రాలకు వార్షిక పారితోషికంగా రూ.7 కోట్లు చెల్లిస్తుంది బీసీసీఐ...
గ్రేడ్ ఏలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, అజింకా రహానే, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, మరియు హార్ధిక్ పాండ్యాలకు కాంట్రాక్ట్ లభించింది...
గ్రేడ్ బి కాంట్రాక్ట్లో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్లకు చోటు దక్కింది..
గ్రేడ్ సీలో కుల్దీప్ యాదవ్, నవ్దీప్ సైనీ, దీపక్ చాహార్, శుబ్మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ సిరాజ్లకు కాంట్రాక్ట్ దక్కింది...
గ్రేడ్ ఏలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ.5 కోట్లు, గ్రేడ్ బీ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్లకు ఏడాదికి రూ.3 కోట్లు... గ్రేడ్ సీలో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి కోటి రూపాయలు పారితోషికంగా దక్కుతుంది.