MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఒక్క రోజుకి రూ.60 వేలు... దేశవాళీ క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం...

ఒక్క రోజుకి రూ.60 వేలు... దేశవాళీ క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం...

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. జాతీయ జట్టు ప్లేయర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్న భారత క్రికెట్ బోర్డు, దేశవాళీ క్రికెటర్ల విషయంలో మాత్రం చాలా పొదుపుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉండేవి. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ లీగ్‌లు కూడా ఆగిపోవడంతో దేశవాళీ క్రికెటర్లు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 20 2021, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టీమిండియాకి ప్లేయర్లను అందించే దేశవాళీ టోర్నీలపై చిన్నచూపు చూపిస్తుందనే విమర్శలకు ఫుల్‌స్టాప్ పెడుతూ... 2020-21 సీజన్‌లో డొమెస్టిక్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజును 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. 

27

రంజీ ట్రోఫీలో తుదిజట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లకి రోజుకి రూ.35 వేలు మ్యాచు ఫీజు రూపంలో చెల్లించేవారు... తుది జట్టులో చోటు దక్కించుకోకపోయినా, రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం రూ.17,500 అందుతుంది...

37

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడే ప్లేయర్లకు మ్యాచ్‌కి రూ.17,500 చెల్లిస్తారు. రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం చెల్లించేవారు. దీన్ని పెంచాలని సోమవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు... 

47

 బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం 40, అంతకంటే ఎక్కువ రంజీ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లకు రోజుకి రూ.60 వేలు చెల్లిస్తారు. అంటే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కి రూ.2.40 లక్షలు దేశవాళీ క్రికెటర్ల ఖాతాలో చేరుతుంది.

57

20 కంటే ఎక్కువగా 40 లోపు రంజీ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్నవారికి రోజుకి రూ.50 వేలు చెల్లిస్తారు. 20 కంటే తక్కువ అనుభవం ఉన్న ప్లేయర్లకి రోజుకి రూ.40 వేలు దక్కుతుంది...

67

అలాగే అండర్ 23 ప్లేయర్లకు రూ.25 వేలు, అండర్ 19 క్రికెటర్లకి రూ.20 వేలు మ్యాచ్ ఫీజు రూపంలో చెల్లిస్తారు. అండర్ 16 నుంచి సీనియర్ లెవల్ వరకూ ఉన్న 2 వేల మంది మెన్స్ క్రికెటర్లకు ఈ పెంచిన మ్యాచ్ ఫీజులు ఎంతగానో ఉపకరించనున్నాయి.. 

77

అలాగే మహిళా క్రికెటర్ల పారితోషికాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఎప్పటిలాగే ఇక్కడ కూడా మహిళా క్రికెటర్లపైన వివక్ష చూపించిన భారత క్రికెట్ బోర్డు, ఇంతకుముందు చెల్లించే రూ.12,500 కు బదులుగా రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Recommended image2
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Recommended image3
పాకిస్థాన్ పై వరుణ్ చక్రవర్తి మాస్ ట్రోలింగ్.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved