కెప్టెన్ రోహిత్ శర్మ రీఎంట్రీ కన్ఫార్మ్... రాహుల్ త్రిపాఠికి ఒకే ఒక్క మ్యాచ్! వన్డేల్లో శిఖర్ ధావన్...
ఇంగ్లాండ్తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకి దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 సిరీస్ సమయానికి జట్టుకి అందుబాటులోకి రాబోతున్నాడు. జూలై 7 నుంచి ప్రారంభమయ్యే వన్డే, టీ20 సిరీస్లకు జట్లను ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు...
కరోనా నుంచి కోలుకోవడానికి వారానికి పైగా సమయం తీసుకున్న రోహిత్ శర్మ, జూలై 7 నుంచి ప్రారంభమయ్యే వైట్ బాల్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తొలి టీ20 మ్యాచ్లో రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, మిగిలిన రెండు టీ20లకు ప్రకటించిన జట్టులో అతనికి అవకాశం ఇవ్వలేదు...
ఇంగ్లాండ్తో ఐదో టెస్టు ముగిసిన తర్వాత ఒక్క రోజు గ్యాప్లో తొలి టీ20 మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. దీంతో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా వంటి టెస్టు మ్యాచ్ ఆడిన ప్లేయర్లకు తొలి టీ20 నుంచి రెస్ట్ కల్పించారు సెలక్టర్లు...
వీరంతా టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత బర్మింగ్హమ్లోనే ఉంటారు. సౌంతిప్టన్లో తొలి టీ20 ఆడే భారత జట్టు, రెండో టీ20 కోసం బర్మింగ్హమ్ చేరుకుంటుంది. అప్పుడు జట్టులో చేరబోతున్నారు. టీ20 టీమ్లో లేని ప్లేయర్లు, టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత స్వదేశానికి పయనమవుతారు...
Rahul Tripathi
ఇంగ్లాండ్తో తొలి టీ20కి భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్...
Sanju Samson
తొలి టీ20 మ్యాచ్కి ప్రకటించిన జట్టులో రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్... మిగిలిన రెండు టీ20ల్లో పాల్గొనరు. వారి స్థానంలో సీనియర్లు జట్టులోకి వస్తారు...
ఇంగ్లాండ్తో రెండు, మూడో టీ20లకు భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
Image Credit: Getty Images
టీ20ల్లో చోటు కోల్పోయిన భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, వన్డేల్లో భారత జట్టులో కలవబోతున్నాడు. ధావన్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లకు వన్డే సిరీస్లో అవకాశం కల్పించారు సెలక్టర్లు...
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్...