- Home
- Sports
- Cricket
- సిడ్నీ నుంచి కాన్బెర్రాకు మారిన బీబీఎల్ మ్యాచులు... మరి భారత్, ఆస్ట్రేలియా టెస్టు మాత్రం అక్కడే ఎందుకు...
సిడ్నీ నుంచి కాన్బెర్రాకు మారిన బీబీఎల్ మ్యాచులు... మరి భారత్, ఆస్ట్రేలియా టెస్టు మాత్రం అక్కడే ఎందుకు...
సిడ్నీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో బిగ్బాష్ లీగ్ 2021 సీజన్కి సంబంధించిన మూడు మ్యాచ్ల వేదికలను సిడ్నీ నుంచి కాన్బెర్రాకు మారుస్తున్నట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. జనవరి 13న సిడ్నీ థండర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్తో పాటు జనవరి 16న సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్, జనవరి 18న సిడ్నీ థండర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్లను సిడ్నీ నుంచి తరలిస్తున్నట్టు తెలిపింది బీబీఎల్ మేనేజ్మెంట్.

<p>‘ప్రజల ఆరోగ్యాన్ని, నగరాల్లో కొనసాగుతున్న లాక్డౌన్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు’ ప్రకటించాడు బీబీఎల్ హెడ్ అలిస్టర్ డోబ్సన్. </p>
‘ప్రజల ఆరోగ్యాన్ని, నగరాల్లో కొనసాగుతున్న లాక్డౌన్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు’ ప్రకటించాడు బీబీఎల్ హెడ్ అలిస్టర్ డోబ్సన్.
<p>కరోనా కారణంగా బీబీఎల్ మ్యాచులను సిడ్నీ నుంచి తరలించిన క్రికెట్ ఆస్ట్రేలియా, మరి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వేదికను ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.</p>
కరోనా కారణంగా బీబీఎల్ మ్యాచులను సిడ్నీ నుంచి తరలించిన క్రికెట్ ఆస్ట్రేలియా, మరి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వేదికను ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.
<p>బీబీఎల్ మ్యాచ్లకు ఎలాంటి ఆంక్షలకు 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తోంది ఆస్ట్రేలియా. ఆసీస్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.</p>
బీబీఎల్ మ్యాచ్లకు ఎలాంటి ఆంక్షలకు 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తోంది ఆస్ట్రేలియా. ఆసీస్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
<p>భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మూడో టెస్టుకి మాత్రం కేవలం 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నారు. </p>
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మూడో టెస్టుకి మాత్రం కేవలం 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నారు.
<p>అంతేకాకుండా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న సౌత్ వేల్స్ వంటి ఏరియాల నుంచి సిడ్నీ టెస్టు చూడడానికి వచ్చేవారికి అనుమతి లేదు.. </p>
అంతేకాకుండా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న సౌత్ వేల్స్ వంటి ఏరియాల నుంచి సిడ్నీ టెస్టు చూడడానికి వచ్చేవారికి అనుమతి లేదు..
<p>అదీకాకుండా సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్ ద్వారా వసూలైన ఓ మిలియన్ డాలర్లను బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల విరాళార్థం ఇవ్వాలని నిర్ణయించుకుంది.</p>
అదీకాకుండా సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్ ద్వారా వసూలైన ఓ మిలియన్ డాలర్లను బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల విరాళార్థం ఇవ్వాలని నిర్ణయించుకుంది.
<p>మెక్గ్రాత్ ఫౌండేషన్ నేతృత్వంలో వర్చువల్ సీట్లు ఏర్పాటు చేసి మరీ, టికెట్లను అమ్మింది క్రికెట్ ఆస్ట్రేలియా. </p>
మెక్గ్రాత్ ఫౌండేషన్ నేతృత్వంలో వర్చువల్ సీట్లు ఏర్పాటు చేసి మరీ, టికెట్లను అమ్మింది క్రికెట్ ఆస్ట్రేలియా.
<p>వర్చువల్ సీట్ల టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ఆస్ట్రేలియాలో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న 700 కుటుంబాలకు అందచేస్తామని తెలిపాడు మెక్గ్రాత్...</p>
వర్చువల్ సీట్ల టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ఆస్ట్రేలియాలో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న 700 కుటుంబాలకు అందచేస్తామని తెలిపాడు మెక్గ్రాత్...
<p>దీంతో వేదిక మారిస్తే భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.<br />అందుకే కరోనా రిస్క్ ఉన్నప్పటికీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోనే మూడు టెస్టు నిర్వహిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...</p>
దీంతో వేదిక మారిస్తే భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.
అందుకే కరోనా రిస్క్ ఉన్నప్పటికీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోనే మూడు టెస్టు నిర్వహిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...
<p>బయో బబుల్ జోన్లో గడుపుతున్నారు భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు. మ్యాచ్ జరుగుతున్నన్నిరోజులు హోటల్ గదుల నుంచి బయటికి రావద్దని ఇరు జట్ల క్రికెటర్లకు ఆంక్షలు విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా... </p>
బయో బబుల్ జోన్లో గడుపుతున్నారు భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు. మ్యాచ్ జరుగుతున్నన్నిరోజులు హోటల్ గదుల నుంచి బయటికి రావద్దని ఇరు జట్ల క్రికెటర్లకు ఆంక్షలు విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
<p>మరీ హోటల్ గదులకే పరిమితమై, జూలో జంతువుల్లా ఉండలేమని భారత క్రికెట్ జట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హోటల్ చుట్టూ బయో బబుల్ను ఏర్పాటు చేసింది...</p>
మరీ హోటల్ గదులకే పరిమితమై, జూలో జంతువుల్లా ఉండలేమని భారత క్రికెట్ జట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హోటల్ చుట్టూ బయో బబుల్ను ఏర్పాటు చేసింది...