ఎన్నాళ్లో వేచిన ఉదయం... సూర్యకుమార్ యాదవ్కి అవకాశం దక్కడంపై సీనియర్ల సంతోషం...
సూర్యకుమార్ యాదవ్... గత మూడు ఐపీఎల్ సీజన్లలో 400+ స్కోర్లు చేసిన ఏకైక భారత బ్యాట్స్మెన్. మిగిలిన ప్లేయర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నా సరే, ఒక్క అవకాశం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్ 2020 పర్ఫామెన్స్ తర్వాత అతనికి అవకాశం దక్కడం పక్కా అనుకున్నా, ఆస్ట్రేలియా టూర్లో అతనికి అవకాశం దక్కలేదు.
ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు ఎంపిక చేసిన 19 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...
యాదవ్తో ఐపీఎల్ 2020 సీజన్లో అదరగొట్టిన ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ... యువకులకు అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్ అండ్ కో...
‘ఎట్టకేలకు సూర్యకుమార్ యాదవ్, ఎదురుచూపులు ముగిశాయి. కంగ్రాట్స్ బడ్డీ... గుడ్ లక్ ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా... మీ ఆరంగ్రేటం బాగుండాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
‘ఎట్టకేలకు సూర్యకుమార్ యాదవ్ను టీమిండియాలో చూడడం చాలా సంతోషంగా ఉంది... గుడ్ లక్’ అంటూ ట్వీట్ చేశాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్... సూర్యకుమార్ యాదవ్తో పాటు ఇషాన్ కిషన్కి కూడా శుభాకాంక్షలు తెలిపాడు భజ్జీ...
‘ఐపీఎల్ హీరోలు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా భారత జట్టు తరుపున మొట్టమొదటిసారి ఆడబోతున్నందుకు అభినందనలు... మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ పేసర్ ఆర్పీ సింగ్...
ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడి, భారత జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...
కొన్నాళ్లుగా పొట్టిఫార్మాట్లో కనిపించిన రిషబ్ పంత్కి కూడా మరోసారి అవకాశం కల్పించారు సెలక్టర్లు. కొన్నాళ్లుగా వన్డే, టీ20ల్లో కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా వ్యవహారిస్తుండగా, అతనికి కేవలం బ్యాట్స్మెన్గా చోటు కల్పించారు...
వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది. బుమ్రాకి విశ్రాంతి కల్పించడంతో శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ, దీపక్ చాహార్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ పేస్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు.
ఐపీఎల్ 2020 సీజన్లో ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి, ఆస్ట్రేలియా టూర్లో టీ20 సిరీస్కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వరుణ్ చక్రవర్తి స్థానంలో టీ20లకు ఎంపికైన నటరాజన్, వన్డేల్లో, టీ20ల్లో, టెస్టు సిరీస్లో ఎంట్రీ ఇచ్చి అద్భుత పదర్శనతో ఆకట్టుకున్నాడు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఒకే మ్యాచ్లో ఐదు సిక్సర్లు బాది, ఒక్కసారిగా స్టార్గా మారిపోయిన రాహుల్ తెవాటియాకి చాలా తొందరగానే భారత జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది...