పాకిస్తాన్లో కాకపోతే శ్రీలంకలో పెట్టండి... ఆసియా కప్ 2023 టోర్నీపై షోయబ్ అక్తర్ కామెంట్..
ఆసియా కప్ 2023 టోర్నీ గురించి అప్పుడెప్పుడో ఆగస్టులో మొదలైన హై డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం పాక్లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్లో జరపాలని పీసీబీ, అక్కడ జరిగితే టీమిండియాని పంపలేమంటూ బీసీసీఐ వాదనలు వినిపిస్తున్నాయి...
భద్రతా కారణాలతో పాకిస్తాన్కి టీమిండియాని పంపించలేమని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మెన్ జై షా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆసియా కప్ కోసం టీమిండియా, పాక్కి రాకపోతే... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాక్ జట్టు, ఇండియాలో అడుగుపెట్టదని తేల్చి చెబుతోంది పీసీబీ...
‘ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్లోనే జరగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ అలా జరగకపోతే శ్రీలంకలో నిర్వహించాలి.. నాకైతే ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులు చూడాలని ఉంది...
India vs Pakistan
వరల్డ్ క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచులు ఆడితే వచ్చే ఆ క్రేజ్ వేరేగా ఉంటది. టీఆర్పీ రికార్డులన్నీ పేలిపోతాయి... అలాంటి వాతావరణం చూడాలిని ఉంది.. ప్లేయర్ల మధ్య కూడా స్పెషల్ ఎమోషన్ ఉంటుంది...
ఇండియాతో మ్యాచ్ సమయంలో నేను సచిన్ టెండూల్కర్ని అవుట్ చేస్తానని నా టీమ్మేట్స్ ఛాలెంజ్ చేశా. చెప్పినట్టుగానే కోల్కత్తాలో సచిన్ని నా మొదటి బంతికే అవుట్ చేశాడు.
India vs Pakistan
కొన్ని లక్షల మంది అభిమానుల మధ్య సచిన్ టెండూల్కర్ వికెట్ తీశాననే ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను... సచిన్ అవుట్ అవ్వగానే సగం స్టేడియం ఖాళీ అయిపోయింది... అలాంటివి ఇండియా- పాక్ మ్యాచ్లో చాలా ఉంటాయి.. ’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...