కరీన్ కపూర్, మలైకా అరోరాకి సీరం ఇన్స్టిట్యూట్ ఫ్యామిలీతో సంబంధం ఏంటి.. ఫోటోస్ చూస్తే షాక్ అవుతారు..
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు చాలా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది.. అవునండోయ్.. ఆమెకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఆమె సోదరి కరిష్మా కపూర్, అమృత అరోరా, మలైకా అరోరా, కరణ్ జోహార్, మల్లికా భట్, నటాషా పూనావల ఉన్నారు.
నటాషా పూనవల ఎవరో కాదు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఓ అదార్ పూనవల భార్య. కరోనా టీకా కోవిషీల్డ్ భారతదేశంలో అత్యవసర ఉపయోగం కోసం ఆమోదం పొందినప్పటి నుండి అదార్ పూనవల వార్తల్లో నిలుస్తున్నారు.
నటాషా పూనవల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విల్లూ పూనవల్లా ఛారిటబుల్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్. ఆమె కరీనా కపూర్ మంచి స్నేహితులలో ఒకరు.
కరీనా కపూర్, మలైకా అరోరా తరచుగా నటాషా పూనవల దంపతులతో విందులు, హాలిడే టూర్స్ కూడా వెళ్తుంతరు. సైఫ్ అలీ ఖాన్, అమృత అరోరా, కరిష్మా కపూర్ కూడా వీరితో ఎక్కువగా కనిపిస్తుంటారు.
మీరు నటాషా పూనవల ఇన్స్టాగ్రామ్ అక్కౌంట్ చూస్తే మీకు బాలీవుడ్ నటిలతో చాలా ఫోటోలు కనిపిస్తాయి. అయితే నటాషా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఫిల్మ్ డైరెక్టర్ కరణ్ జోహార్కి కూడా మంచి సన్నిహితురాలు.
నటాషా ఒక ఫ్యాషనిస్టా, ఆమె ఛారిటబుల్ పనులు, సామాజిక కార్యక్రమాలు, డొనేషన్స్ వంటి వాటిలో కూడా పాల్గొంటుంది. ఆమె బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ ఫర్ ఇండియా చైర్పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.