వామ్మో.. ఫోన్ లో సిగ్నల్ లేకపోయినా కాల్స్ చెయ్యొచ్చా? కొత్త ఫీచర్ అదిరిపోయిందిగా
మీ సెల్ఫోన్ లో సిమ్ కి నెట్వర్క్ లేదా? సిగ్నల్ లేక కాల్స్ చేయలేకపోతున్నారా? ఇకపై మీరు ఇలాంటి ఇబ్బందులు పడక్కరలేదు. మీకు దగ్గర్లో ఏ నెట్వర్క్ టవర్ ఉంటే ఆ సిగ్నల్స్ ఉపయోగించుకొని కాల్స్ చేసుకోండి. అవసరమైతే 4జీ డేటా కూడా వాడుకోండి. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? వివరంగా తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ కాలంలో స్మార్ట్ఫోన్స్ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. స్మార్ట్ఫోన్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇండియాలో ఎక్కడి నుంచైనా ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి చాలా సింపుల్ గా కాల్ చెయ్యొచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో అంటే గ్రామాలు, కొండ ప్రాంతాలు, లోయలు, అడవులు ఇలా కొన్ని చోట్ల సిగ్నల్స్ లేక కాల్ చెయ్యలేకపోతాం. మనం వాడే సిమ్ టవర్లు అక్కడ తక్కువగా ఉండటమే దీనికి కారణం.
ఈ సిగ్నల్ సమస్యకి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసిఆర్) అనే కొత్త ఫీచర్ని ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ద్వారా జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ యూజర్లు సొంత సిమ్ సిగ్నల్ లేకపోయినా అక్కడ దొరికే ఏ నెట్వర్క్నైనా వాడి కాల్స్ చెయ్యొచ్చు.
అంటే బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు ఇప్పుడు ఏ నెట్వర్క్నైనా వాడి 4జి సర్వీస్లను యాక్సెస్ చెయ్యొచ్చు. ఉదాహరణకు మీరు వొడాఫోన్ సిమ్ వాడుతున్నారనుకుందాం. అర్జెంట్గా కాల్ చెయ్యాలంటే సిగ్నల్ లేదు. దగ్గర్లో వొడాఫోన్ టవర్ కూడా లేదు. జియో, ఎయిర్టెల్ టవర్లు ఉన్నాయి. కానీ మీరు వొడాఫోన్ సిమ్ వాడుతున్నారు కాబట్టి ఆ టవర్లు మీకు పనికిరావు.
కానీ ఇప్పుడు ఐసిఆర్ వల్ల మీ వొడాఫోన్ సిమ్కి సిగ్నల్ లేకపోయినా, దగ్గర్లో ఉన్న జియో, ఎయిర్టెల్ టవర్ నెట్వర్క్ని వాడి కాల్స్ చెయ్యొచ్చు. 4జి నెట్వర్క్ని కూడా వాడుకోవచ్చు.
డిజిటల్ ఇండియా నిధి
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు వేర్వేరుగా టవర్లు కట్టుకున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా నిధి (డిఐఎన్) ద్వారా టవర్లు కట్టడానికి ప్రైవేట్ కంపెనీలకి డబ్బు ఇస్తుంది. డిఐఎన్ నిధితో కంపెనీలు టవర్లు కడతాయి. అప్పుడు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ వాటి నెట్వర్క్ని షేర్ చేసుకుంటాయి.
అంటే మీ వొడాఫోన్ సిమ్కి సిగ్నల్ లేకపోతే దగ్గర్లో ఉన్న జియో లేదా ఎయిర్టెల్ టవర్ నెట్వర్క్ని వాడి కాల్స్ చెయ్యొచ్చు. 4జి నెట్వర్క్ కూడా వాడుకోవచ్చు. ఐసిఆర్ వల్ల కంపెనీలు చాలా టవర్లు కట్టాల్సిన అవసరం ఉండదు.
ఇబ్బంది లేకుండా కాల్స్
ఇండియాలో ఎక్కడైనా ఏ సిమ్ వాడినా ఇబ్బంది లేకుండా సర్వీస్ వాడుకోవచ్చు. ఇలా ఇండియా అంతటా 27,000 టవర్లు నిర్మించి 35,400కి పైగా గ్రామాలకు 4జి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
డీఐఎన్ నిధితో టవర్లు కట్టే కంపెనీలు మాత్రమే వాటి నెట్వర్క్ని షేర్ చేసుకుంటాయని గుర్తుంచుకోవాలి.
అంటే మీ వొడాఫోన్ సిమ్కి సిగ్నల్ లేకపోతే దగ్గర్లో ఉన్న జియో లేదా ఎయిర్టెల్ టవర్ నెట్వర్క్ని వాడి కాల్స్ చెయ్యొచ్చు. 4జి నెట్వర్క్ కూడా వాడుకోవచ్చు. ఐసిఆర్ వల్ల కంపెనీలు చాలా టవర్లు కట్టాల్సిన అవసరం ఉండదు.