వాహనదారులపై ఇంధన ధరల బాదుడు.. నేడు మరోసారి రికార్డు స్థాయికి పెట్రోల్ ధరల పెంపు..
న్యూ ఢీల్లీ: ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) ఒక రోజు వ్యవధి తర్వాత మంగళవారం ఇంధన ధరలను తీవ్రంగా పెంచాయి. దీంతో పెట్రోల్ ధర పై లీటరుకు 35 పైసలు, డీజిల్ ధర పై లీటరుకు 28 పైసలు పెరిగింది.
ఈ పెరుగుదలతో దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.81 చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.18 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలలో తగ్గుదల ఉండగా, దేశీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. మే 4 నుంచి 32వ సారి చమురు ధరలు పెరిగాయి.
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
లక్నోలో పెట్రోల్ ధర రూ .95.97, డీజిల్ ధర రూ .89.59
చండీఘడ్ లో పెట్రోల్ ధర నేడు రూ .95.03, డీజిల్ ధర లీటరుకు రూ .88.81
రాంచీలో పెట్రోల్ ధర రూ .94.35, డీజిల్ ధర లీటరుకు రూ .94.12
భోపాల్లో పెట్రోల్ ధర రూ .107.07, డీజిల్ ధర లీటరుకు రూ .97.93
పాట్నాలో పెట్రోల్ ధర రూ .100.81, డీజిల్ ధర లీటరుకు రూ .94.52
బెంగళూరులో పెట్రోల్ ధర రూ .102.11, డీజిల్ ధర లీటరుకు రూ .94.54
నోయిడాలో పెట్రోల్ ధర రూ .96.08, డీజిల్ ధర లీటరుకు రూ .89.67
జైపూర్లో పెట్రోల్ ధర రూ .105.54, డీజిల్ ధర లీటరుకు రూ .98.29
శ్రీగంగనగర్లో పెట్రోల్ ధర రూ .110.09, డీజిల్ ధర లీటరుకు రూ .102.42
హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.102.69, డీజిల్ ధర లీటరుకు రూ. 97.20
క్రూడ్ ఆయిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెట్ క్రూడ్ ఆయిల్ధర 74.58 డాలర్లుగా నమోదు అయ్యింది. క్రితం రోజుతో పోల్చితే ధరలో మార్పు కేవలం 0.1 శాతమే ఉంది. ఐనప్పటికీ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ పోతున్నాయి.
వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల బట్టి ఇంధన ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్పై అత్యధిక వ్యాట్ను రాజస్థాన్ విధించింది.