MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • ఎలక్ట్రిక్ కార్లు, బైకులు వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్.. వాటిని రీసేల్ చేయడం చాలా కష్టమట, ఎందుకంటే

ఎలక్ట్రిక్ కార్లు, బైకులు వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్.. వాటిని రీసేల్ చేయడం చాలా కష్టమట, ఎందుకంటే

Electric cars: ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగానే ఉన్నాయి, జీఎస్టీ 2.0 తర్వాత వాటి ధరలు ఇంకా పడిపోయాయి. ఎక్కువ మంది ఈవీలను కొంటున్నారు. కానీ వాటిని రీసేల్ చేయడం కష్టం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకో తెలుసా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 28 2025, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొనడం సులువే... అమ్మడమే కష్టం
Image Credit : TATA

కొనడం సులువే... అమ్మడమే కష్టం

పెట్రోలు డీజిల్ తో పనిలేకుండా విద్యుత్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు కొత్తగా ఎక్కువ మంది మనసును దోచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటిని వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఈవీలను కొన్నా కూడా వాటిని రీసేల్ చేయడం కష్టమనే వాదన వినిపిస్తోంది. దీనికి బ్లూస్మార్ట్ అనే భారతీయ ఎలక్ట్రిక్ క్యాబ్ సంస్థని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఈ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల బారిన పడి తమ వాహనాలను వెంటనే అమ్మకానికి పెట్టింది. ఆ కార్లన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయినా కూడా ఆ కారు ధరలో కేవలం నాలుగో వంతు ధరకే అవి అమ్ముడయ్యాయి. దీంతో ఈ కార్లను కొన్నా కూడా వాటిని రీసేల్ చేయడం కష్టమని అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాటరీ ఖర్చు ఎక్కువే
Image Credit : TATA

బ్యాటరీ ఖర్చు ఎక్కువే

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుదలకు ముఖ్య కారణం అందులో వాడే బ్యాటరీ. ఎలక్ట్రిక్ కారు ధరలో 30 నుంచి 40 శాతం ఖర్చు బ్యాటరీ కోసమే చేస్తారు. ఎప్పుడైతే కారు పాత పడుతుందో బ్యాటరీ సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. దాన్ని తరచుగా ఛార్జింగ్ చేయాల్సి రావచ్చు. లేదా తరచూ అది వేడెక్కిపోవచ్చు. వాహనం కూడా ఆ బ్యాటరీ పనితీరు వల్ల సరిగ్గా నడపలేకపోవచ్చు. పోనీ బ్యాటరీని మారుద్దామా అంటే అది చాలా ఖర్చుతో కూడిన విషయం. అందుకే ఆ బ్యాటరీల కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తుఫానులు అధికంగా వస్తాయెందుకు?
Related image2
బాబా వంగా జోస్యం నిజమైతే 2026లో బంగారం ఉన్నవారు కోటీశ్వరులే
35
రేటు అంచనా వేయలేరు
Image Credit : Pixabay

రేటు అంచనా వేయలేరు

సాధారణ కార్లను మెకానిక్ దగ్గర తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్ కి ఎంత ధరకు కొనవచ్చో చెప్పమంటే అతడు ఇంజిన్ సామర్ధ్యాన్ని చూసి చెప్పేస్తాడు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్థితిని అంచనా వేయడం కష్టం. బ్యాటరీ డేటా అనేది ఆటోమేకర్ సాఫ్ట్ వేర్ లో లాక్ అయ్యి ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళు చూడలేరు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల విలువను అంచనా వేయడం కూడా కష్టంగా మారి... చాలామంది అవి వాటిని సెకండ్ హ్యాండ్ కొనేందుకు ఇష్టపడడం లేదు.

45
మరి ఎందుకు కొంటున్నారు?
Image Credit : Pixabay

మరి ఎందుకు కొంటున్నారు?

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ మాత్రం వేగంగానే అభివృద్ధి చెందుతోంది. ఛార్జింగ్ వేగంగా కావడం, తక్కువ ఖర్చు, కొత్త మోడల్స్, కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్లు.. వీటి వల్ల అది ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఒకసారి ఛార్జి చేస్తే చాలు 200 నుంచి 300 కిలోమీటర్లకు పైగానే కార్లు పరుగులు తీస్తున్నాయి. అదే పెట్రోల్ కార్లు అయితే వాటికి ఎక్కువ ఇంధనం అవసరం పడుతుంది. అదే ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తక్కువ విద్యుత్ తోనే నడుస్తాయని అభిప్రాయంతో ఎంతో మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

55
ఏం చేయాలి?
Image Credit : Pixabay

ఏం చేయాలి?

ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం వల్ల పర్యావరణానికి కూడా మేలే జరుగుతుంది. ఎలాంటి కాలుష్యం విడుదలవ్వదు. అందుకే ప్రభుత్వం కూడా సబ్సిడీలు అందిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు చైనాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీలు వస్తున్నాయి. చైనా నుంచి భారీగానే ఇతర దేశాలకు ఈవీలు ఎగుమతి అవుతుండడంతో వాటి ధరలు కూడా తగ్గిపోతున్నాయి. అయితే వాటిని తిరిగి రీసేల్ చేయడంలో మాత్రం ఎంతోమంది విఫలమవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తుఫానులు అధికంగా వస్తాయెందుకు?
Recommended image2
బాబా వంగా జోస్యం నిజమైతే 2026లో బంగారం ఉన్నవారు కోటీశ్వరులే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved