MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తుఫానులు అధికంగా వస్తాయెందుకు?

AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తుఫానులు అధికంగా వస్తాయెందుకు?

AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరచూ తుఫానుల బెడద ఎక్కువ. సంవత్సరానికి ఒక్క తుఫానైనా ఏపీ ప్రజలను అల్లాడించేస్తుంది. ఇలా ఏపీకే తుఫానులు, భారీ వర్షాలు అధికంగా ఎందుకు వస్తాయి? 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 28 2025, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీకే తుఫానులు ఎందుకు?
Image Credit : PTI

ఏపీకే తుఫానులు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తుఫానులు కొత్త కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త పేరుతో తుఫానులు వస్తూనే ఉంటాయి. ఈ రాష్ట్రానికి ప్రతి ఏడాది తుఫానులు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం భౌగోళిక స్థానం. అలాగే ఆ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు. ఈ రెండింటి కారణంగానే తరచూ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఉన్న తీర ప్రాంత ప్రజలకు తరచూ తుఫానులు బెడద తగులుతూనే ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తీర రేఖ ఎక్కువ
Image Credit : Pixabay

తీర రేఖ ఎక్కువ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 974 కిలోమీటర్లు పొడవైన తూర్పు తీరరేఖ ఉంది. ఇది బంగాళాఖాతం వల్ల ఏర్పడింది. ఈ బంగాళాఖాతం ఉష్ణ మండలంలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే సముద్రపు నీరు కూడా ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. వేడి నీరు తుపానుల ఉత్పత్తికి ముఖ్యమైన ఇంధనంగా మారుతుంది. అందుకే బంగాళాఖాతంలో తరచూ తుఫానులు వచ్చి ఏపీని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

Related Articles

Related image1
బాబా వంగా జోస్యం నిజమైతే 2026లో బంగారం ఉన్నవారు కోటీశ్వరులే
Related image2
Powerful passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. అమెరికా మాత్రం కాదు
35
ఈ రాష్ట్రాలకే తుపాను ముప్పు
Image Credit : Pixabay

ఈ రాష్ట్రాలకే తుపాను ముప్పు

ప్రపంచంలోనే బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే బంగాళాఖాతం సముద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ భాగంలో వ్యాపించి ఉంది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, తుఫానులు సాధారణంగా వాయువ్యదిశగా లేదా వాయువ్య పడమర దిశగా కదులుతూ ఉంటాయి. అంటే అవి మొదటిగా తాకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఒడిశా, పశ్చిమబెంగాల్ ను తాకుతాయి. ఒక తుఫాను తాకే మొదటి రాష్ట్రం ఏపీనే కాబట్టే ఇక్కడే ప్రతి ఏడాది తుఫానులు వస్తుంటాయి.

45
ఈ నెలల్లోనే తుపానులు
Image Credit : Pixabay

ఈ నెలల్లోనే తుపానులు

ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో తుఫానులు అధికంగా వస్తాయో తెలుసా? ఏప్రిల్ నుండి జూన్ వరకు. అంటే సరిగ్గా వర్షాకాలానికి ముందు నెలలో తుఫానులు ఏర్పడే అవకాశం ఎక్కువ. అలాగే ఋతుపవనాలు కాలం ముగిసిపోయిన తర్వాత.. శీతాకాలం మొదలయ్యే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కూడా భారీ తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు భారీ తుఫాన్లు వస్తాయి. ఈశాన్యం నుంచి వచ్చే ఋతుపవనాల గాలులు, సముద్ర ఉష్ణోగ్రతలు కలిపి తుఫాన్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. బంగాళాఖాతంలో వాయు పీడనంలో వచ్చే తేడాలు కూడా తుఫానులకు కారణాలే. అవి తుపానుగా మారి మొదట ఏపీ తీరానికే దూసుకొస్తాయి. తీరం అధికంగా ఆంధ్ర రాష్ట్రానికే ఉంది కాబట్టి మొదటి ప్రభావితం అయ్యేది ఆంధ్ర ప్రజలే.

55
ఈ జిల్లాల ప్రజలకే
Image Credit : Pixabay

ఈ జిల్లాల ప్రజలకే

ఏపీలో ఏర్పడే తుపానుల వల్ల ప్రధానంగా ప్రభావం పడేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల వారికే. ఈ జిల్లాలు తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. వీటికి తీర రేఖ కూడా ఎక్కువ. అందుకే ప్రతి ఏడాది తుఫానుల బారిన పడే అవకాశం ఈ జిల్లా ప్రజలకే అధికం. వీరికి భారీ వర్షాలు, ఈదురు గాలులు, తుఫానులు... అన్నింటినీ భరించడం అలవాటుగా మారిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
వడదెబ్బల ముప్పు.. ఎల్‌నినో ఎఫెక్ట్ షాకింగ్! | AP & Telangana Weather Update | Asianet News Telugu
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !
Recommended image3
Now Playing
CM Chandrababu: చెత్త ఇస్తే నిత్యవసర సరుకులు వీళ్ళ ప్లాన్ చూసి చంద్రబాబు షాక్| Asianet News Telugu
Related Stories
Recommended image1
బాబా వంగా జోస్యం నిజమైతే 2026లో బంగారం ఉన్నవారు కోటీశ్వరులే
Recommended image2
Powerful passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. అమెరికా మాత్రం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved