MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Rupee vs US Dollar: రూపాయి పతనానికి కారణాలు ఇవే, భారీగా బలపడిన డాలర్, 2047 నాటికి భారత్ ఆర్థిక పరిస్థితి ఇదే..

Rupee vs US Dollar: రూపాయి పతనానికి కారణాలు ఇవే, భారీగా బలపడిన డాలర్, 2047 నాటికి భారత్ ఆర్థిక పరిస్థితి ఇదే..

మరోసారి 80 రూపాయల స్థాయికి పతనమైన రూపాయి విలువతో, ఆర్థిక నిపుణులు బెంబేలెత్తి పోతున్నారు. ముఖ్యంగా  పెట్రోల్, డీజిల్ సహా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. 

2 Min read
Krishna Adhitya
Published : Aug 30 2022, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ద్రవ్యోల్బణం నియంత్రణకు కఠిన చర్యలు తప్పవని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించడంతో ఒక్కసారిగా డాలర్ ధర ఎగిసింది. అయితే సోమవారం ఉదయం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.11కి పడిపోయింది. అయితే మంగళవారం కొద్దిగా తేరుకొని డాలర్ విలువ 79.46 వద్ద ట్రేడవుతోంది. 
 

28

ఇదిలా ఉంటే శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.87గా ఉంది. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఫెడరల్ రిజర్వ్ కఠిన చర్యలు తీసుకుంటుందని జెరోమ్ పావెల్ శుక్రవారం చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేటును పెంచాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. సామాన్యులకు, వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందన్నది నిజం. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ వేగం కోల్పోయి, ఉద్యోగాల కోత కూడా ఏర్పడవచ్చు. అయినా కఠిన చర్యలు తీసుకోకుంటే ఇంతకంటే ఎక్కువ బాధను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’ అని పావెల్ పేర్కొన్నాడు.
 

38

పావెల్ ప్రకటన ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. US ఫెడరల్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు, ఫెడరల్ బ్యాంక్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచబోతున్నట్లు పావెల్ సూచించాడు. 

48

ఇదిలా ఉంటే  గత నెలలో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.06కి చేరింది. ముడి చమురు ధరలు పెరగడం, భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా రూపాయి విలువ క్షీణించింది. జూలై 21 తర్వాత డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి 80 మార్కును దాటింది.

58

ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం ఖాయం కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత మార్కెట్ నుంచి మూలధన ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇది రూపాయి విలువపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 

68

మరోవైపు వచ్చే 25 ఏళ్లలో సగటు వార్షిక వృద్ధి 7-7.5 శాతం ఉంటే, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 20,000 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ మంగళవారం తన అంచనాను వ్యక్తం చేశారు. 
 

78

వచ్చే 25 ఏళ్లలో దేశం సగటున 7-7.5 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో వృద్ధి చెందితే, దేశ వార్షిక తలసరి ఆదాయం 10,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని డెబ్రోయ్ 'డ్రాఫ్ట్ కాంపిటీటివ్‌నెస్ ఎట్ 100 ఫర్ ఇండియా'ను విడుదల చేస్తూ చెప్పారు. . 2047 నాటికి అత్యధిక మానవాభివృద్ధి కేటగిరీలో ఉన్న దేశాల్లో భారత్‌ కూడా చేరుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం, భారతదేశం 2700 బిలియన్ల GDPతో ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

88

దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా వర్గీకరించబడింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.   

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved