MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Vande Bharat train: కొత్త వందే భారత్ రైలు వచ్చేస్తోంది, ఇది ఎక్కడ నుంచి మొదలై ఎక్కడికి వెళుతుందంటే..

Vande Bharat train: కొత్త వందే భారత్ రైలు వచ్చేస్తోంది, ఇది ఎక్కడ నుంచి మొదలై ఎక్కడికి వెళుతుందంటే..

భారతీయ రైల్వేలో వందే భారత్ రైలు (Vande Bharat train) కొత్త ప్రభంజనం. దేశవ్యాప్తంగా వందే భారత్ సర్వీసులు మెల్లగా మొదలవుతున్నాయి. త్వరలో చెన్నై నుంచి రామేశ్వరానికి వందేభారత్ ప్రారంభం కానుంది. చెన్నైలో ఉన్న తెలుగు వారికి ఇది ఎంతో ఉపయోగకరం.

1 Min read
Haritha Chappa
Published : Sep 27 2025, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త వందే భారత్ సర్వీసు
Image Credit : IRCTC

కొత్త వందే భారత్ సర్వీసు

వందే భారత్ రైలులో ప్రయాణం ఎంతో సులువుగా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరాలు చేరుకోవచ్చు. దేశ వ్యాప్తంగా చాలా తక్కువ వందే భారత్ రైలు సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో వందే భారత్ సర్వీసు మొదలవ్వబోతోంది. చెన్నై నుంచి  రామేశ్వరానికి ఈ సర్వీసు నడవబోతోంది. రామేశ్వరానికి రోజూ వేలాది మంది పర్యాటకులు వస్తారు. వారి కోసం ఈ సర్వీసు మొదలు పెట్టారు.  పాంబన్ వంతెన పనులు పూర్తవడంతో, చెన్నై నుంచి ఈ  రైలు నడిపేందుకు సిద్ధమయ్యారు.

25
పనులు పూర్తి
Image Credit : google

పనులు పూర్తి

పాంబన్ వంతెన దగ్గర కొత్త రైలు మార్గంలో విద్యుదీకరణ పనులు చివరి దశకు చేరాయి. త్వరలోనే దీని మీద నుంచి వందే భారత్ రైలు మొదలవ్వబోతోంది. ప్రస్తుతం చెన్నై-రామేశ్వరం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11-12 గంటల సమయం తీసుకుంటున్నాయి. అందే వందేభారత్ రైల్లో వెళితే రెండు మూడు గంటల సమయం సేవ్ అవుతుంది.

Related Articles

Related image1
Vande Bharat Train: వందే భారత్ మొదటి స్లీపర్ రైలు వచ్చేస్తోంది, ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో
Related image2
Vande Bharat: వందే భారత్ రైళ్లలో మీరు వద్దన్నా భోజనం పెడతారు, ఫుడ్ సప్లైలో కొత్త మార్పులు
35
ఎన్ని గంటల ప్రయాణం?
Image Credit : ANI

ఎన్ని గంటల ప్రయాణం?

చెన్నై నుంచి ఈ వందే భారత్ రైలు ప్రారంభం కాబోతోంది.  రాత్రికి తిరిగి చెన్నైకు చేరుకునేలా  దక్షిణ రైల్వే సర్వీసును ప్లాన్ చేస్తోంది. వందే భారత్ రైలు 665 కి.మీ. దూరాన్ని 8-9 గంటల్లో పూర్తి చేస్తుంది. దీని వల్ల ప్రయాణ సమయం 2-3 గంటలు తగ్గుతుంది. ఇది ఎంతో పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

45
ఏ సమయానికి?
Image Credit : Asianet News

ఏ సమయానికి?

వందే భారత్ రైలు చెన్నై నుంచి ఉదయం 5:50 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 2:30కి రామేశ్వరం చేరుకుంటుంది. తిరిగి అక్కడ్నించి మధ్యాహ్నం 3:30కి బయలుదేరి రాత్రి 11కి చెన్నై చేరుకుంటుంది.  ఇది అన్ని స్టేషన్లలోనూ ఆగదు. కొన్ని ప్రధాన స్టేషన్లలోనే ఆగుతుంది.

55
ధరలు ఇలా
Image Credit : Narendra Modi/Facebook

ధరలు ఇలా

చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లే వందే భారత్ రైలు ధరలు కూడా సాధారణంగానే ఉన్నాయి.  ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,400, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.2,400గా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved