MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో 6 మహిళలకు చోటు.. ఎప్పటిలాగే ముకేష్ అంబానీ మళ్ళీ టాప్..

ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో 6 మహిళలకు చోటు.. ఎప్పటిలాగే ముకేష్ అంబానీ మళ్ళీ టాప్..

న్యూఢిల్లీ:   ఫోర్బ్స్  అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశంలోని ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఓ‌పి జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ 18 బిలియన్ డాలర్ల (దాదాపు  రూ.13.46 లక్షల కోట్లు) సంపదతో ఈ జాబితాలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. గత సంవత్సరంలో ఆమే సంపద  13 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.72 లక్షల కోట్లు). 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 07 2021, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తరువాత 71 ఏళ్ల సావిత్రి జిందాల్ ఫోర్బ్స్ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో రెండవ అత్యంత ధనిక మహిళా పారిశ్రామికవేత్త హావెల్స్ ఇండియాకు చెందిన 76 ఏళ్ల వినోద్ రాయ్ గుప్తా. ఈమె 24వ స్థానంలో ఉంది. ఆమె సంపద ఈ సంవత్సరం రెట్టింపు కాగా 7.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ .5.68 లక్షల కోట్లు) చేరింది. తర్వాతి స్థానం ముంబైలో ఉన్న ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ మేజర్ యూ‌ఎస్‌వి ప్రైవేట్ లిమిటెడ్  లీనా తివారీ (43) ఉన్నారు. ఆమె మొత్తం ర్యాంక్ 43 అలాగే ఆమె నికర విలువ 4.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3.28 లక్షల కోట్లు). 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ఈ జాబితాలో 47 ర్యాంక్‌తో తదుపరి మహిళా పారిశ్రామికవేత్తగా  బైజు సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ (35) ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడడంతో పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ టీచింగ్ లోకి మారిన తరువాత బైజు వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా పెరిగాయి. శ్రీమతి గోకుల్‌నాథ్ సంపద గత సంవత్సరంలో 1 బిలియన్ (దాదాపు రూ. 7,477 కోట్లు) పెరిగి 4.05 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.02 లక్షల కోట్లు) పెరిగింది.

35

బయోకాన్ కిరణ్ మజుందార్-షా(68) ఐదవ స్థానంలో ఉన్నారు. ఆమె 53వ ర్యాంకు సాధించినప్పటికీ ఆమె సంపద గత ఏడాదిలో తగ్గింది. ఆమె 2020లో   4.6 బిలియన్ (దాదాపు రూ.3.43 లక్షల కోట్లు) డాలర్లు కలిగి ఉంది, కానీ ఈ సంవత్సరం ఆమె నికర విలువ  3.9 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ. 2.91 లక్షల కోట్లు) క్షీణించింది .
 

45

తర్వాతి స్థానంలో ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (TAFE) అధినేత అమల్‌గామేషన్స్ కుటుంబానికి చెందిన మల్లికా శ్రీనివాసన్ ఉన్నారు. ఆమె నికర విలువ 2.89 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.16 లక్షల కోట్లు). ఈ జాబితాలో ఆమె 73వ స్థానంలో ఉన్నారు.

55

ఫోర్బ్స్ ఇండియా ప్రతి సంవత్సరం భారతదేశంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల జాబితాను రూపొందిస్తుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 14వ సంవత్సరంలో అత్యంత సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2021లో అతని నికర విలువకు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) జోడించారు. కరోనా మహమ్మారి రెండవ సంవత్సరంలో దేశంలోని అత్యంత ధనవంతుల సంపదను 50 శాతం పెరిగిందని ఫోర్బ్స్ తాజా నివేదికలో పేర్కొంది .

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
Recommended image2
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది
Recommended image3
Bank Rules: బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఫీజు ఎందుకు వసూలు చేస్తాయో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved