MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 396 పాయింట్లు పతనం, నిఫ్టీ 18 వేల స్థాయికి..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 396 పాయింట్లు పతనం, నిఫ్టీ 18 వేల స్థాయికి..

నేడు  మంగళవారం నష్టాలతో  ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ (stock market)ట్రేడింగ్‌ ముగిసే వరకు జోరును అందుకోలేకపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బి‌ఎస్‌ఈ(bse) సెన్సెక్స్ (sensex)396.34 పాయింట్లు (0.65 శాతం) క్షీణించి 60,322.37 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ(nse) నిఫ్టీ (nifty)18000 స్థాయిని కొనసాగించలేకపోయింది అలాగే 110.25 పాయింట్లు (0.61 శాతం) పడిపోయి 17,799 వద్ద ముగిసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 16 2021, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ వారం రెండో రోజు కూడా స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతోనే ముగిసింది.  బ్లూ చిప్‌ కంపెనీ ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో దేశీ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలే ఎక్కువగా జరిగాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమకు చెందిన షేర్లు లాభాలు పొందడంతో మార్కెట్‌కి కొంత ఊరట లభించింది.  మధ్యాహ్నం సమయంలో కద్ది కోలుకున్నట్టు కనిపించినా మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో నష్టాలు తప్పలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 బి‌ఎస్‌ఈ 30-షేర్ల సెన్సెక్స్ 120.81 పాయింట్లు (0.20 శాతం) క్షీణించి 60,597.90 వద్ద ప్రారంభమైంది, అయితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26.35 పాయింట్లు (0.15 శాతం) పడిపోయి 18,083 స్థాయి వద్ద ప్రారంభమైంది.

34

లాభాల్లో ఉన్న కంపెనీలు
నేటి ట్రేడింగ్ సమయంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ షేర్లు మంచి లాభాలను చవిచూశాయి. మరోవైపు టాటా ఇస్పాత్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్‌, ఎనర్జీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున పతనమయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ సూచీ స్వల్ప లాభాలతో ముగిసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సుజూకి కంపెనీ షేర్లు లాభాలు పొందగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ , హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా నష్టపోయాయి.

44

సోమవారం స్వల్ప పెరుగుదలతో 
సోమవారం నాడు  స్టాక్ మార్కెట్ జోరుగా ప్రారంభమైనప్పటికీ ట్రేడింగ్ ముగిసే సమయానికి భారత స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ముగిసింది. రోజంతా ట్రేడింగ్‌లో ఎన్నో హెచ్చు తగ్గులు కనిపించి చివరకు రెండు సూచీలు గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32.02 పాయింట్లు (0.05 శాతం) స్వల్ప లాభంతో 60,718.71 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 6.70 పాయింట్లు లాభపడి (0.04 శాతం) 18,109.45 వద్ద ముగిసింది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
ప‌నికి రాని పాత డ్ర‌మ్ముల‌తో ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు.. ఉన్న ఊరిలోనే బెస్ట్ బిజినెస్‌
Recommended image2
Under 20000 Phones: సూపర్ ఫీచర్లతో 20 వేల రూపాయలలోపు వచ్చే బెస్ట్ 5G ఫోన్లు ఇవిగో
Recommended image3
Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved