MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 320 పాయింట్లు జంప్, నిఫ్టీ కూడా..

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 320 పాయింట్లు జంప్, నిఫ్టీ కూడా..

నేడు  గురువారం స్టాక్ మార్కెట్ (stock market)పదునైన ప్రారంభాన్ని చేసింది. 30-షేర్ల బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 320.59 పాయింట్లు అంటే 0.56 శాతం లాభంతో 57,251.15 వద్ద ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 111.35 పాయింట్లు అంటే 0.66 శాతం లాభపడి 17,066.80 స్థాయి వద్ద ప్రారంభమైంది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 23 2021, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా రెండో రోజు కూడా గ్రీన్ మార్క్‌తో ముగిసింది. సెన్సెక్స్ 611 పాయింట్ల మేర 56,930 వద్ద ముగియగా, నిఫ్టీ 16,955 స్థాయి వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. 

క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడుల సంఖ్య వేగంగా పెరగడంతో మరోవైపు  క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఒత్తిడి ఇంకా కరోనా  కొత్త వేరియంట్‌ల భయం  క్రిప్టోకరెన్సీ నిషేధ వార్తల కారణంగా ప్రజలు క్రిప్టోకరెన్సీల నుండి డబ్బును కూడా ఉపసంహరించుకుంటున్నారు. వాస్తవానికి, గత 1 వారంలోనే పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టిన వారి డబ్బులో 1000 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు.

23

భారతదేశంలో క్రిప్టోకరెన్సీలకు గుర్తింపు లేదు. అయితే దీనిని అనుమతించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలను నిషేధించడానికి లేదా నియంత్రించడానికి ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టలేదని ఊహాగానాలు ఉన్నాయి, అయితే ఈ బిల్లు రాక కారణంగా గత 1 నెల రోజులుగా క్రిప్టో మార్కెట్ గందరగోళంలో ఉంది. ప్రజలు క్రిప్టోకరెన్సీలను ఎక్కువగా విక్రయిస్తున్నారు, పెట్టుబడిదారులు దాని నుండి వెనక్కి తగ్గుతున్నారు.
 

33

క్రిప్టోకరెన్సీ బ్యాన్ వార్తల భయాందోళనలు ప్రజల విశ్వాసాన్ని కదిలించడం ప్రారంభించింది. డిసెంబర్ 11 నుండి 17 మధ్య ఒక వారంలో క్రిప్టోకరెన్సీల నుండి పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో 142 మిలియన్ల డాలర్లు ఆంటే దాదాపు రూ.1,0737 కోట్లను ఉపసంహరించుకున్నారు. డేటా ప్రకారం 17 వారాలలో మొదటిసారిగా క్రిప్టోకరెన్సీల నుండి ఇంత పెద్ద మొత్తం డబ్బు ఉపసంహరణ జరిగింది. అంతకుముందు జూన్ 2021లో 97 మిలియన్ల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీ విక్రయించారు.

 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved