MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • IRCTC: ఇకపై కొన్ని రైళ్లలో డయాబెటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేక మీల్స్, అది కూడా సాధారణ ధరకే

IRCTC: ఇకపై కొన్ని రైళ్లలో డయాబెటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేక మీల్స్, అది కూడా సాధారణ ధరకే

IRCTC: డయాబెటిస్ రోగులకు శుభవార్త.  రైలు ప్రయాణం సమయంలో వారికి ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా ప్రత్యేక మీల్స్ అందించబోతున్నారు. అది కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే.   

1 Min read
Haritha Chappa
Published : Nov 02 2025, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
Image Credit : eRail.in

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. మన దేశంలో లాభాల్లో ఉన్న సంస్థగా భారతీయ రైల్వే నిలిచింది. తాజాగా ఐఆర్‌సిటీసీ డయాబెటిక్ రోగుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వారు రైలు ప్రయాణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం ప్రత్యేక ఆహారం అందించేందుకు సిద్ధమైంది.  ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఈ ఆహారాన్ని అందించనుంది. ఇందుకోసం అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయరు.  టికెట్ బుక్ చేసేటప్పుడే ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చు.  ఇప్పటికే రైల్వే బోర్డు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.

24
మనదేశంలోనే ఎక్కువ
Image Credit : Social Media

మనదేశంలోనే ఎక్కువ

భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు.  ఎందుకంటే మనదేశంలో సుమారు 22 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే వస్తోంది. యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువమందికి వస్తోంది. అందుకే రైల్వే ఈ కొత్త మీల్స్ ప్రాజెక్టును మొదలుపెట్టింది.

Related Articles

Related image1
Fake Rs500 Notes: చలామణిలో భారీగా నకిలీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా చూసి తీసుకోండి
Related image2
Petrol Price: ట్రంప్ వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా?
34
ఎలాంటి ఫుడ్ రకాలు?
Image Credit : South Western Railways - SWR

ఎలాంటి ఫుడ్ రకాలు?

రైల్వే బోర్డు జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం కొన్ని రైళ్లలోనే డయాబెటిక్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.  రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ సహా అన్ని ప్రీ-పెయిడ్ రైళ్లలో ఐదు రకాల ఆహార ఎంపికలు ఉంటాయి. అవి శాకాహారం, మాంసాహారం, జైన్ ఫుడ్, డయాబెటిక్ వెజ్, డయాబెటిక్ నాన్-వెజ్. ఇందులో మీకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.

44
అదనంగా వసూలు చేయరు
Image Credit : Getty

అదనంగా వసూలు చేయరు

 ప్రయాణికులు కావాలనుకుంటే రైలు ఎక్కాక కూడా ఆహారాన్ని ఎంపికచేసుకోవచ్చు. లేదా వద్దని చెప్పవచ్చు. టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా ఫుడ్ ఆప్షన్‌ను మార్చుకోవచ్చు. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ ఆహారానికి లేదా పానీయాలకు అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved