MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • గృహ, వాహన రుణగ్రహీతలకు నో రిలీఫ్.. యదాతధంగా వడ్డీ రేట్లను కోనసాగించిన ఆర్‌బి‌ఐ..

గృహ, వాహన రుణగ్రహీతలకు నో రిలీఫ్.. యదాతధంగా వడ్డీ రేట్లను కోనసాగించిన ఆర్‌బి‌ఐ..

 న్యూఢిల్లీ: గృహ, వాహన రుణగ్రహీతలకు మళ్ళీ నిరాశే ఎదురైంది.  ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం మానేటరీ పాలసీ  రివ్యూలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీంతో ప్రస్తుత ఈ‌ఎం‌ఐ ధరలను కొనసాగించాల్సిన అవసరం ఉంది.  

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Oct 08 2021, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అక్టోబర్ 8న అంటే  నేడు సెంట్రల్ బ్యాంక్   మానేటరీ పాలసీ  రివ్యూ ఫలితాలను ప్రకటించింది. ఇందులో  రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. రేపో అనేది ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు అందించే నిధుల  ధర.  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్ ఉపయోగించే ఒక సాధనం. రివర్స్ రెపో రేటు అంటే ఆర్‌బి‌ఐ బ్యాంకుల నుండి తీసుకునే అప్పు రేటు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
<p>rbi announcement, rbi, bank holiday, corona pandemic</p>

<p>rbi announcement, rbi, bank holiday, corona pandemic</p>

ఎం‌పి‌సి చివరి ఏడు రివ్యూలలో కీ బెంచ్‌మార్క్ ధరలను యథాతథంగా ఉంచింది. పాలసీ రేటును యథాతథంగా ఉంచాలని ఎం‌పి‌సి నిర్ణయించడం వరుసగా ఎనిమిదోసారి. చారిత్రక కనిష్టానికి వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా డిమాండ్ పెంచడానికి ఆర్బీఐ చివరిసారిగా 22 మే 2020న పాలసీ రేటును సవరించింది.

6-సభ్యులతో కూడిన  ఎం‌పి‌సి వడ్డీ రేటును యథాతథంగా ఉంచడానికి ఏకగ్రీవంగా ఓటు వేసింది. వృద్ధికి మద్దతుగా ఇంకా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా అవసరమైనంత వరకు అనుకూల వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకుంది.

33

ఆర్‌బిఐ సిపిఐ ద్రవ్యోల్బణం 2021-22 సమయంలో 5.7 శాతంగా అంచనా వేసింది. రెండవ త్రైమాసికంలో 5.9 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.3 శాతంగా, ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతంగా, నష్టాలు విస్తృతంగా సమతుల్యం చేయబడ్డాయి. 2022-23 మొదటి త్రైమాసికంలో సిపిఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా అంచనా వేసింది.

ఆగస్టులో సిపిఐ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం డేటాను అక్టోబర్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
PF Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం డ్రా చేసుకోవచ్చు, కొత్త రూల్స్ ఇవే
Recommended image2
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.15 వేల స్కాలర్‌షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
Recommended image3
Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved