MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కేవలం రూ.100 కడితే 6.70 % వడ్డీ: ఈ సూపర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏంటో తెలుసా?

కేవలం రూ.100 కడితే 6.70 % వడ్డీ: ఈ సూపర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏంటో తెలుసా?

ఎంత సంపాదించినా కొంత దాచుకోవడం అందరూ చేస్తుంటారు. కొందరు రూ.లక్షలు దాస్తుంటారు. మరికొందరు రూ.వేలల్లో సేవ్ చేస్తుంటారు. ఇలా దాచుకున్న డబ్బుకు కూడా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు వడ్డీలు ఇస్తుంటాయి. అయితే అవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లో ప్రతి నెల కేవలం రూ.100 కడితే మాక్సిమం 6.70 % వడ్డీ ఇస్తారు. అద్భుతమైన ఈ స్కీమ్ ఎక్కడ ఉంది. ఎలా దీంట్లో పెట్టుబడి పెట్టాలి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

3 Min read
Naga Surya Phani Kumar
Published : Nov 01 2024, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15

ఈ రోజుల్లో దాదాపు అందరూ ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. దాని నుండి మంచి రాబడి పొందుతున్నారు. మీ డబ్బుకు సేఫ్టీ, సెక్యూరిటీ కల్పించే బెస్ట్ ప్లేస్ పోస్టాఫీసు. ఇక్కడ అనేక డిపాజిట్ ప్లాన్స్ ఉన్నాయి. చాలా తక్కువ డబ్బుతో పొదుపు చేయడానికి వీలున్న పథకాలు పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.100 కడితే సామాన్యులకు కూడా ప్రయోజనకరమైన చిన్న పొదుపు పథకం RD గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీస్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్(RD) పథకం మీరు పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం. ఈ పథకంలో మీరు డబ్బు పెట్టుబడి పెడితే మీకు మంచి రాబడి వస్తుంది. ఇది కాకుండా మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. 

25

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ RD పథకం పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ పథకం కింద కనీసం రూ.100తో ఖాతాను ప్రారంభించి ప్రతి నెల రూ.100 కడితే సరిపోతుంది. 5 సంవత్సరాలు ఇలా కడితే  సంబంధిత ఖాతా ద్వారా సంవత్సరానికి 6.70% వడ్డీని మీరు పొందుతారు.

పోస్ట్ ఆఫీస్ RD పథకంలో పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేకమైన అర్హతలు ఏమీ లేవు. ఇందులో ఎవరైనా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. మంచి లాభాలను పొందవచ్చు. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ RD పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా  మీరు ఒక ఖాతాను తెరవాలి. 

35

RD పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మినిమం అమౌంట్ వచ్చి రూ.100 మాత్రమే. అయితే మీరు ఇంకా  ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే రూ. 500, రూ. 600, రూ. 700, రూ. 900, రూ. 1000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఎంచుకున్న పెట్టుబడి అమౌంట్ ను ప్రతి నెలా కట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఎంపిక చేసిన డిపాజిట్ అమౌంట్ ను మార్చడానికి వీలు ఉండదు. అంటే మీరు నెలకు రూ.500 కట్టాలని ఫిక్స్ అయితే ప్రతి నెలా అంతే కట్టాలి. డబ్బులు లేవని, తక్కువగా ఉన్నాయని తగ్గించడానికి వీలుండదు. అదేవిధంగా రూ.500 కంటే ఎక్కువ కట్టాలని మీరు అనుకున్నా కట్టడానికి అవకాశం ఉండదు. ప్రతి నెలా ఫిక్స్‌డ్ గా  కట్టాలి. 

45

పెట్టుబడి పెట్టడం ఎలాగంటే..

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద కనీసం 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా సంవత్సరానికి 6.70 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం కూడా ఉంది. 

ఉదాహరణకు ఈ పథకం కింద మీరు నెలకు రూ.500 పెట్టుబడి పెట్టి ఖాతాను ప్రారంభించారు అనుకుందాం. ప్రతి నెలా రూ.500 చొప్పున కట్టాలి. ఇలా 5 సంవత్సరాలు కడితే రూ.30000 పెట్టుబడి అవుతుంది. ఈ మొత్తానికి మీకు సంవత్సరానికి 6.70 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో  మీరు అయిదేళ్ల తర్వాత రూ.35,681 పొందుతారు.

అదే విధంగా మీరు నెలకు రూ.1000 పెట్టుబడి పెట్టి ఖాతాను ప్రారంభించి 5 సంవత్సరాలు కడితే రూ.60000 డిపాజిట్ చేస్తారు. స్థిర వడ్డీ రేటు ద్వారా మీరు అయిదేళ్ల తర్వాత రూ.71,369 పొందుతారు. అదే మీరు నెలకు రూ.700 పెట్టుబడి పెడితే వడ్డీతో సహా రూ.49,955 పొందుతారు. 

55

RD ఖాతాను 5 సంవత్సరాల ముందే క్లోజ్ చేయొచ్చా? 

ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత మధ్యలో ఇబ్బందులు వచ్చి మీరు కొనసాగించలేకపోతే మీరు ఈ స్కీమ్ ను ఆపేయొచ్చు. అయితే మీరు కొన్ని నియమాలను పాటించాలి.

ఉదాహరణకు మీరు ఈ పథకాన్ని 3 సంవత్సరాల తర్వాత మూసివేస్తే మీరు కొంత నష్టపోతారు. అంటే మీకు రావాల్సిన 6.7 శాతం వడ్డీ ఇవ్వరు. 5 సంవత్సరాల ముందు ఖాతాను మూసివేస్తే మీకు ఇచ్చిన వడ్డీ నిబంధనల ప్రకారం తగ్గించబడుతుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ ఇస్తారు. 

పోస్ట్ ఆఫీస్ RD పథకంలో మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి సంబంధిత పథకం గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు పెట్టుబడి పెట్టండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved