MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కేవలం రూ.1500 కడితే చాలు ... రూ.5 లక్షలు పొందే అద్భుత అవకాశం

కేవలం రూ.1500 కడితే చాలు ... రూ.5 లక్షలు పొందే అద్భుత అవకాశం

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో నెలకు ₹1500 పెడితే... 15 ఏళ్ల తర్వాత ₹5 లక్షలు సంపాదించవచ్చు. పోస్టాఫీస్ అందిస్తున్న ఈ పథకంపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 16 2024, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం వల్ల మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ... అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి. సాధారణ ప్రజలు తమ పొదుపులను పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన ఎంపికగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకాన్ని ఎంచుకోవచ్చు.

26

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్ పొందవచ్చు. ఇలా ఓ అద్భుతమైన స్కీమ్ ను ఇండియన్ పోస్టాఫిస్ నడుపుతోంది. ప్రతి నెలా కేవలం రూ. 1500 మాత్రమే డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ. 5 లక్షలు పొందవచ్చు. ఇలా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడిపై 7.1% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది పోస్టాఫీస్ అధిక వడ్డీ రేటు పథకాలలో ఒకటి.

36

ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత, దీనిని 5 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. ఇది మీ రాబడిని మరింత పెంచుకోవడానికి మరింత సహాయపడుతుంది. మీరు ఏటా కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

46

 మీరు కూడా పిపిఎఫ్ లో చేరాలనుకుంటున్నారా..? అయితే సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి కేవలం రూ. 500 కనీస డిపాజిట్‌తో పిపిఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మాత్రమే కాకుండా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మీకు క్రమం తప్పకుండా ఆదాయం పొందే హామీని కూడా ఇస్తుంది.

56

ఈ పథకంలో రూ. 5 లక్షలు పొందడానికి, మీరు ప్రతి నెలా రూ. 1500 పెట్టుబడి పెట్టవచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 18,000 చొప్పున చెల్లించాలి. ఇలా మొత్తం రూ. 2,70,000 పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం 7.1% వడ్డీ రేటు ప్రకారం 15 సంవత్సరాలలో మీరు మొత్తం రూ. 2,18,185 వడ్డీని పొందుతారు.

66

15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 4,88,185 లభిస్తుంది. మీరు ఎక్కువ రాబడిని కోరుకుంటే,  ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved