ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు
మీకు అర్జెంట్ గా లోన్ కావాలా? పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓ ప్రత్యకమైన ఆఫర్ తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీరు తీసుకున్న లోన్ ఎలాంటిదైనా ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజులు ఉండవు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇస్తున్న ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది లోన్లు తీసుకోవాలనుకుంటారు. కాని వడ్డీల భారం మోయలేక వెనుకాడతారు. వడ్డీలకు తోడు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇలా ఇతర ఛార్జీలు కూడా ఎక్కువగా ఉండటంతో అదనపు భారం భరించలేక లోన్ తీసుకోవడానికే ఆసక్తి చూపరు. అందుకే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర ఛార్జీలు వేయకుండా లోన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), వినియోగదారులపై భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ‘PNB నిర్మాన్ 2025’ పేరిట ఒక నూతన సేవలను ప్రకటించింది. ఈ సేవల ప్రకారం హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, డిజి గోల్డ్ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించింది.
‘PNB నిర్మాన్ 2025’ స్కీమ్ ఏప్రిల్ 23న ప్రారంభమైంది. ఈ ఆఫర్ ద్వారా హోమ్ లోన్ తీసుకున్న వారు లీగల్, వాల్యుయేషన్ ఫీజులపై సబ్సిడీ లభిస్తుంది. అంతేకాకుండా వెహికల్, హోమ్, ఎడ్యుకేషన్ రుణాలపై ఎలాంటి ఇతర ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు. పైగా ఈ లోన్స్ వడ్డీ రేటుపై 5 బేసిక్ పాయింట్లు రాయితీ కూడా ఇస్తోంది.
‘PNB నిర్మాన్ 2025’ స్కీమ్ జూన్ 20, 2025 వరకు మాత్రమే అమల్లో ఉండనుంది. అంటే జూన్ 20 వరకు అప్లై చేసిన వారికి పై పేర్కొన్న అన్ని లోన్లపై ఛార్జీలు ఉండవు. ఇది లోన్ అర్జెంట్ అయిన వారికి భారీ ఊరట అనే చెప్పొచ్చు. బ్యాంక్ ప్రకటన ప్రకారం ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు మరింత చౌకగా లోన్ పొందవచ్చు.
PNB వెల్లడించిన వివరాల ప్రకారం హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, డిజి గోల్డ్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవని బ్యాంక్ స్పష్టం చేసింది. పైగా ఈ సేవలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్బీ శాఖలన్నింటిలోనూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వినియోగదారులు తమకు దగ్గరలో ఉన్న పీఎన్బీ శాఖకు వెళ్లి లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అవకాశం వాడుకుని అవసరమైన లోన్ సేవలను ఛార్జీల లేని ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు.