MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆధార్‌ కార్డు ఉంటే చాలు రూ. 2.5 లక్షలు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఏంటంటే..

ఆధార్‌ కార్డు ఉంటే చాలు రూ. 2.5 లక్షలు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఏంటంటే..

వ్యాపారస్తులకు పెట్టుబడి కోసం డబ్బులు అవసరపడతాయి. దీంతో చాలా మంది మైక్రో ఫైనాన్స్ లను ఆశ్రయిస్తారు. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అన్నట్లు మైక్రో ఫైనాన్స్ వాళ్లు ఓ రేంజ్ లో వడ్డీ రూపంలో దోచుకుంటారు. అయితే అత్యంత తక్కువ వడ్డీతో ఎలాంటి గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకం అందిస్తోంది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్ పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1 Min read
Narender Vaitla
Published : Feb 02 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
PM స్వనిధి పథకం ద్వారా లోన్

PM స్వనిధి పథకం ద్వారా లోన్

చిన్న వ్యాపారస్తులకు డబ్బు అవసరమైతే బ్యాంకులకు వెళ్లరు. ఎందుకంటే వీరికి ఎలాంటి ఇన్ కమ్ ప్రూఫ్ ఉండదు. దీంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు వడ్డీ రూపంలో భారీగా దోచుకుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణం పొందొచ్చు. 

27
కేంద్రం నుంచి లోన్ పథకం

కేంద్రం నుంచి లోన్ పథకం

తక్కువ మొత్తంలో డబ్బులు అవసరమయ్యే వ్యాపారులకు కేంద్రం ఈ పథకాన్ఇన తీసుకొచ్చింది. ఈ పథకం కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. తక్కువ వడ్డీ, వేగంగా రుణం పొందొచ్చు. 

37

పీఎం స్వనిధి పథకం చిరు వ్యాపారుల కోసం. చిన్న వ్యాపారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి వెనుకాడతాయి. గ్యారెంటీ, ష్యూరిటీ వంటివి చూపించలేక చిరు వ్యాపారులు లోన్ పొందలేరు. కానీ పీఎం స్వనిధి పథకంలో ఈ సమస్య ఉండదు. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణాలు అందిస్తారు. 

47

కోవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు అండగా నిలిచే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చాలా మంది చిరు వ్యాపారులు లబ్ధిపొందారు. రుణాలు తీసుకొని తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. 

57
నియమాలు

నియమాలు

కరోనా సమయంలో మోదీ ప్రారంభించిన స్వనిధిలో మొదట 10,000 రూపాయల లోన్ ఇచ్చేవారు. తర్వాత లోన్ మొత్తాన్ని పెంచారు. ఇప్పుడు 2.5 లక్షల వరకు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.

67
తిరిగి చెల్లింపు

తిరిగి చెల్లింపు

తీసుకున్న రుణాన్ని సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి లోన్ పొందవచ్చు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తే రుణ పరిమితిని పెంచుతూ పోతారు. 

77
ఎక్కడ దరఖాస్తు చేయాలి?

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

ఆన్‌లైన్ లేదా CSC కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ రేటు లోన్ తీసుకునే సమయంలో నిర్ణయిస్తారు. ఆధార్ ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. PM స్వనిధిలో 12 నెలల గడువు ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved