MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెగాసస్ స్పైవేర్ : సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పలేని కేంద్రం.. ఈ స్పైవేర్ ఏంటి, విచారణ ఎందుకు ?

పెగాసస్ స్పైవేర్ : సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పలేని కేంద్రం.. ఈ స్పైవేర్ ఏంటి, విచారణ ఎందుకు ?

 పెగాసస్ కేసు(pegasus case)ను దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(supreme court) బుధవారం నిర్ణయించింది. ఈ అంశంలో ఎన్నో సాంకేతిక లోపాల కారణంగా పిటిషనర్ వాదనలను అంగీకరించడం మినహా ప్రాథమికంగా తమకు వేరే మార్గం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

4 Min read
Ashok Kumar | Asianet News
Published : Oct 27 2021, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిజానికి పెగాసస్ కేసులో చాలా వాస్తవాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరింత సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది,  కేవలం జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొంది. 

1. పెగాసస్ స్పైవేర్ అంటే ఏమిటి? 
2. పెగాసస్ స్పైవేర్ ఎలా ఉపయోగిస్తారు ?
3. భారతదేశంలో దీని లక్ష్యం ఎవరు ?
4. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంది ? 
5. సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదన, కోర్టు నిర్ణయానికి కారణం ఏమిటి ?

26

1. పెగాసస్ స్పైవేర్ అంటే ఏమిటి?
పేరు సూచించినట్లుగా స్పైవేర్ అనేది గూఢచర్యానికి సంబంధించిన పని కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్ లేదా ప్రోగ్రామ్. పెగాసస్ స్పైవేర్ ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూఢచారి ఏజెన్సీలు దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్ నుండి డేటాను రహస్యంగా సేకరించేందుకు ఉపయోగపడేలా ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సైబర్ ప్రోగ్రామ్‌గా రూపొందించబడింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొందరు మాజీ గూఢచారులు ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారని చెబుతున్నారు. 

36

2. పెగాసస్ ఎలా ఉపయోగించబడుతుంది?
పెగాసస్  క్రింద వచ్చే డివైజెస్ జాబితాలో దాదాపు అన్ని డివైజెస్ వస్తాయి. అయితే ఈ స్పైవేర్ చాలా వరకు ఆపిల్  భద్రతా వ్యవస్థను బ్రేక్ చేయడానికి ఉపయోగించబడుతుంది. వాస్తవానికి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే విషయంలో ఆపిల్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. పెగాసస్ ఆపిల్  iMessage యాప్, పుష్ నోటిఫికేషన్ సర్వీస్ (PSN) ప్రోటోకాల్‌లను బ్రిచింగ్ ద్వారా సమాచారాన్ని దొంగిలించినట్లు తెలుస్తోంది. ఈ స్పైవేర్ ఐఫోన్‌లో  డౌన్‌లోడ్ చేయబడిన ఏదైనా అప్లికేషన్‌ను ఇంటిమేట్ చేయగలదు ఇంకా ఆపిల్ సర్వర్‌ల ద్వారా అందుకున్న పుష్ నోటిఫికేషన్‌లకు ఫోన్‌ను బాధితురాలిగా మార్చగలదు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏదైనా ఫోన్‌లో సమాచారాన్ని దొంగిలించడానికి పెగాసస్ స్పైవేర్ అవసరం లేదు, కానీ హ్యాకర్ టార్గెట్ చేసిన ఫోన్ నంబర్ మాత్రమే తెలుసుకోవాలి. స్పైవేర్ సిస్టమ్ ఆటోమేటిక్ గా టార్గెట్  నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి దానిని లక్ష్యంగా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ ఈ సిస్టమ్ ఎప్పుడు విజయవంతం కాదు, ఎందుకంటే అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు అప్ డేట్ చేసిన తర్వాత సెక్యూరిటి ప్రోటోకాల్‌లను అప్ డేట్ చేస్తాయి. అయితే, పెగాసస్ టార్గెట్ చేసిన సెల్ ఫోన్‌ను రక్షించడానికి ఒక మార్గం టార్గెట్ ఫోన్  డిఫాల్ట్ బ్రౌజర్‌ని మార్చడం.  
 

46

3. భారతదేశంలో పెగాసస్ ఎవరిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది?
ఫ్రెంచ్ నాన్-ప్రాఫిట్ మీడియా ఆర్గనైజేషన్ ఫర్బిడెన్ స్టోరీస్ పెగాసస్ స్పైవేర్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న సుమారు 50,000 మొబైల్ నంబర్‌ల జాబితాను లీక్ చేసింది, అందులో కేవలం 1500 మాత్రమే గుర్తించగలిగారు. ఈ జాబితా మొదట జూలై 18న వెల్లడైంది, ఇందులో 161 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. ఎంతో మంది దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, విద్యార్థులు, న్యాయవాదులు, పాత్రికేయులు వంటి పేర్లు బయటకు వచ్చాయి. అయితే, ఎన్‌ఎస్‌ఓ  గ్రూప్ ఈ స్పైవేర్‌ను దేశ ప్రభుత్వాలకు మాత్రమే అందించిందని, లీక్ అయిన జాబితాలో ఉన్న వ్యక్తుల మొబైల్‌లు హ్యాక్ చేయలేదని  చెబుతూనే వస్తుంది.

 
భారతదేశంలోని రాజకీయ ప్రముఖులు రాహుల్ గాంధీ, రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఐ‌ఏ‌ఎస్ అధికారి అశ్విని వైష్ణవ్ (ప్రస్తుత రైల్వే మంత్రి), ఐ‌టి మంత్రి ఈ స్పైవేర్ లక్ష్యంగా ఉన్నట్లు ఒక నివేదిక సూచించింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రవీణ్ తొగాడియాతో సహా 14 మంది పేర్లు కూడా ఉన్నాయి. 

అంతేకాకుండా ఈ జాబితాలో పేర్లు ఉన్న రాజ్యాంగ అధికారులు, కార్యకర్తలలో మాజీ ఎన్నికల కమిషన్ కమిషనర్ అశోక్ లావాసా పేరు కూడా ఉంది. దీంతో పాటు అలోక్ వర్మ, రాకేష్ అస్థానా, రాకేష్ శర్మ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కార్యకర్తలు, విద్యావేత్తలలో రోనా విల్సన్, ఆనంద్ తెల్తుంబ్డే, షోమా సేన్, గౌతమ్ నవ్లాఖా  కూడా 40 మంది పేర్లలో ఉన్నారు. వ్యాపారవేత్తలో అనిల్ అంబానీ పేరు ముఖ్యంగా ఉందట. అంతేకాకుండా దలైలామా చాలా మంది అనుచరులు పెగాసస్ గూఢచర్యం టార్గెట్ లో  ఉన్నట్లు గుర్తించారు.

56

ది వైర్‌కు చెందిన ఎంకే వేణు, సిద్ధార్థ్ వరదరాజన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్, హిందుస్థాన్ టైమ్స్‌కు చెందిన శిశిర్ గుప్తా, హిందూకి చెందిన విజేతా సింగ్ సహా 29 మంది జర్నలిస్టులు ఈ స్పైవేర్ లక్ష్యంగా గుర్తించారు. 

సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకుంది? 
గూఢచర్యం కుంభకోణంలో దర్యాప్తు చేయాల్సిన పనిలేదని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాలు పదేపదే లేవనెత్తినప్పటికీ, ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి లేదా ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి నిరాకరిస్తూనే ఉంది. కాగా, పెగాసస్ కేసుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ దాఖలు చేసిన వారిలో పిటిషనర్ ఎంఎల్ శర్మ, పరంజోయ్ గుహా ఠాకుర్తా ప్రేమ్ శంకర్ ఝా, ఎన్ రామ్ వంటి జర్నలిస్టులు ఉన్నారు. దీంతో కోర్టు అన్ని పిటిషన్లను కలిపి విచారణకు అనుమతించింది. ఈ అంశంపై మొదట ఆగస్టు 5న విచారణ జరిగింది. 

సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదన, కోర్టు నిర్ణయానికి కారణం ఏమిటి?
కొన్ని విచారణల తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 16న పరిమిత అఫిడవిట్‌ను దాఖలు చేసింది, పెగాసస్‌కు సంబంధించిన ఆరోపణలు కేవలం భయాందోళనలు, ధృవీకరించని మీడియా నివేదికల ఆధారంగా ఉన్నాయని పేర్కొంది. అయితే, పెగాసస్ గూఢచర్యం కేసులో నడుస్తున్న తప్పుడు కథనాలను తొలగించడానికి పని చేసే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం గురించి ప్రభుత్వం మాట్లాడింది. 

అయితే, కేంద్రం ఇచ్చిన సమాధానంతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు, మరింత సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరినప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి పెగాసస్ వాడకంపై మరిన్ని వివరాలను అందించలేమని ప్రభుత్వం వాదించింది. దీనిపై న్యాయస్థానం మౌఖికంగా మాట్లాడుతూ  భద్రతపై మరింత సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని బలవంతం చేయలేమని, అయితే ప్రజల ఫోన్లు హ్యాక్ అయ్యాయా లేదా అనేది మాత్రమే తెలుసుకోవాలని కోరింది. పెగాసస్ స్పైవేర్ వల్ల కొంతమంది వాట్సాప్ వినియోగదారులు ప్రభావితమయ్యారని 2019లో ప్రభుత్వమే అంగీకరించిందని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కోర్టు గుర్తు చేసింది. 

66

సుప్రీంకోర్టు పరిశీలనలు చేసినప్పటికీ కేంద్రం వివరణాత్మక సమాధానం ఇవ్వకపోవడంతో, చీఫ్ జస్టిస్ ఎన్వీ రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అన్నింటికంటే, కేంద్ర ప్రభుత్వం తదుపరి సమాచారం ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టు తన మధ్యంతర నిర్ణయాన్ని సెప్టెంబర్ 13న రిజర్వ్ చేసింది. అయితే ఈ సమయంలో కోర్టు ప్రభుత్వం మరోసారి ఆలోచించుకునే అవకాశం ఇచ్చింది. సెప్టెంబరు 23న, ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదికి కోర్టు వచ్చే వారం విచారణ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎందుకు ఆలస్యం అయ్యాయి?
సుప్రీంకోర్టు నుంచి ఈ ఉత్తర్వులు రావడంలో జాప్యం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల పలువురు నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు నిరాకరించారని సీజేఐ రామన్న స్వయంగా చెప్పారు. దీంతో ఆర్డర్ ఆలస్యమైంది. ఇప్పుడు అక్టోబరు 27న సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఒక కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడింది, ఈ విషయంపై సాంకేతిక అంశాలను పరిశీలిస్తుంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved