MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పేటి‌ఎం ఐ‌పి‌ఓ ఎఫెక్ట్: కంపెనీల ఆందోళనల.. ఇతర ఐ‌పి‌ఓలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?

పేటి‌ఎం ఐ‌పి‌ఓ ఎఫెక్ట్: కంపెనీల ఆందోళనల.. ఇతర ఐ‌పి‌ఓలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?

దేశంలోనే అగ్రగామి డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్  పేటి‌ఎం (Paytm) ఐ‌పి‌ఓ భవితవ్యం చూసిన తర్వాత ఇతర కంపెనీలకి  ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఒక నివేదిక ప్రకారం షేర్ మార్కెట్‌లో పేటి‌ఎం నిరాశాజనకమైన ప్రారంభం తర్వాత మొబిక్విక్ (MobiKwik) ఓయో (Oyo) ప్లాన్ చేసిన ఐ‌పి‌ఓ ప్రణాళికలు చీకటిలోకి నెట్టయి. 

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 20 2021, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పేటి‌ఎం ఐ‌పి‌ఓ  స్టాక్ మార్కెట్ అరంగేట్రం నుండి పెట్టుబడిదారులు చాలా ఆశలు పెట్టుకున్నారని, అయితే లిస్టింగ్‌తో వారి ఆశలు నీరుగారిపోయాయని ఒక నివేదిక పేర్కొంది. ఇలాంటి పరిస్థితులలో పెట్టుబడిదారులు పేటి‌ఎంను మరచిపోవడానికి అలాగే పేటి‌ఎం ద్వారా వచ్చిన నష్టాలను మరచిపోవడానికి మూడు నుండి నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపారు.
 

25

ఆరుగురు విశ్లేషకులు రూపొందించిన నివేదిక 
 పేటి‌ఎం వంటి ఇతర రంగ సంస్థలపై ఐ‌పి‌ఓల ప్రభావాన్ని ఆరుగురు విశ్లేషకులు, బ్యాంకర్లు విశ్లేషించారని ముంబైలోని ఒక బ్రోకరేజ్ హౌస్ వ్యవస్థాపకుడు చెప్పారు. భారతీయ చరిత్రలో షేర్ మార్కెట్ అరంగేట్రం సమయంలో  డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటి‌ఎం ఐ‌పి‌ఓ  విధిని చూసిన తర్వాత, ఇతర కంపెనీల భవిష్యత్ ఐ‌పి‌ఓపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన తన నివేదికలో తెలిపారు.

35

మొదటి తొమ్మిది నెలల్లో 
ఒక నివేదిక ప్రకారం భారతీయ కంపెనీలు 2021 మొదటి తొమ్మిది నెలల్లో ఇనీషియల్ షేర్ సేల్స్  ద్వారా $9.7 బిలియన్లను సేకరించాయి, గత రెండు దశాబ్దాలలో ఈ కాలంతో పోలిస్తే ఇది అత్యధికం. అయితే చెల్లింపుల సేవల సంస్థ మొబిక్విక్, హోటల్ అగ్రిగేటర్ ఓయో ఈ సంవత్సరం చివరి నాటికి ఐ‌పి‌ఓని ప్రారంభించాలని యోచిస్తున్నాయి, అయితే పేటి‌ఎం సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులకు భారీ నష్టాన్ని అందించడం ద్వారా పేటి‌ఎం వారి ఆశలను నీరుగార్చింది. 
 

45

విశ్లేషకుల భయాలు
ఇప్పుడు అధిక డిమాండ్ ఉన్న ఐ‌పి‌ఓల రాక కూడా లిస్టింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు.  

అతిపెద్ద ఐ‌పి‌ఓగా పేటి‌ఎం
పేటి‌ఎం ఐ‌పి‌ఓ దేశంలోనే అతిపెద్ద ఐ‌పి‌ఓ. అయితే దీని ద్వారా కంపెనీ 18,300 కోట్ల రూపాయలను సమీకరించాలని యోచిస్తోంది. పేటి‌ఎం ఐ‌పి‌ఓ  బ్యాండ్ ధర రూ. 2080 నుండి రూ. 2150 వరకు ఉంది. పేటీఎం షేర్లు నవంబర్ 18న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్‌కు వచ్చిన తొలి రోజే ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. లిస్టింగ్ తర్వాత స్టాక్ మొదటి రోజు 27 శాతం పడిపోయింది ఇంకా ఇష్యూ ధర రూ. 2,150కి బదులుగా రూ.1,560 వద్ద నిలిచింది. అంటే ఐపీఓ ఇష్యూ ధరతో పోల్చితే ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు రూ.590 చొప్పున నష్టపోయారు. 

55

10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పేటి‌ఎం  
పేటి‌ఎం ఇండియాలో సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మొదట్లో ఈ కంపెనీని మొబైల్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్ అని పిలిచేవారు. అయితే, 2016లో దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత పేటి‌ఎం కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. దీని తరువాత కంపెనీ బీమా, బంగారం అమ్మకాలు, సినిమా అండ్ విమాన టిక్కెట్లు, బ్యాంకు లావాదేవీలు మొదలైన రంగాలలోకి కూడా ప్రవేశించింది. పేటి‌ఎంలో దాదాపు 22 మిలియన్ల వ్యాపారులు సంవత్సరానికి $80 బిలియన్ల లావాదేవీలు జరుపుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 337 మిలియన్ల మంది రిజిస్టర్డ్  వినియోగదారులు ఉన్నారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved