MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కరోనా సంక్షోభం ఒకవైపు పెరిగిపోతున్న పేదరికం, మరోవైపు రెట్టింపవుతున్న ధనికుల సంపద.. : ఆక్స్‌ఫామ్రిపోర్ట్

కరోనా సంక్షోభం ఒకవైపు పెరిగిపోతున్న పేదరికం, మరోవైపు రెట్టింపవుతున్న ధనికుల సంపద.. : ఆక్స్‌ఫామ్రిపోర్ట్

కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఒక వైపు భారతదేశ బిలియనీర్ల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు పేదరికం కూడా వేగంగా పెరుగుతోంది. ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలో పేదల సంఖ్య గత సంవత్సరంలో రెట్టింపు కాగా, కొత్తగా 40 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. కాగా బిలియనీర్ల పరంగా ప్రపంచంలోని అనేక దేశాలను భారత్ అధిగమించింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 17 2022, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలను 
మనం బిలియనీర్స్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ప్రపంచంలోని 500 మంది ధనవంతులు గత సంవత్సరం వారి నికర విలువ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది మేలో పట్టణ నిరుద్యోగం 15 శాతానికి పెరిగి ఆహార అభద్రత మరింత తీవ్రరూపం దాల్చిందని, ఇప్పుడు ఫ్రాన్స్, స్వీడన్ ఇంకా స్విట్జర్లాండ్‌ల కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ ఉందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. 

25

నివేదిక ప్రకారం, ప్రపంచం కరోనా మహమ్మారి వ్యాప్తితో  సంక్షోభం ఎదురుకొంటుంటే ఇప్పుడు ఓమిక్రాన్
వేరియంట్ మళ్లీ ఆందోళనలను లేవనెత్తింది. కరోనా కాలంలో పేదల ఆహార సంక్షోభం తలెత్తిందని, అయితే ధనవంతుల సంపదలో మాత్రం విపరీతమైన పెరుగుదల ఉందని నివేదికలో చెప్పబడింది. గమనించదగా విషయం ఏంటంటే కరోనా కాలంలో భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద దాదాపు రెట్టింపు అయింది. 
 

35

ఆక్స్‌ఫామ్ ప్రకారం దేశంలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరగగా, వీరిలో కొత్తగా 40 మంది బిలియనీర్లు  ఈ జాబితాలో చేరారు. దీంతో ప్రస్తుతం దేశంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 142కి చేరింది. వీరి సంపద దాదాపు 720 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 53 లక్షల కోట్లుగా ఉందని సోమవారం ప్రచురించిన అసమానత(inequality)పెరుగుదలపై ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది.

45

గౌతమ్ అదానీ సంపద 
ఒక నివేదిక ప్రకారం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద గత సంవత్సరంలో అతిపెద్ద పెరుగుదలను నమోదు చూసింది. అదానీ గ్రూప్ గత సంవత్సరం భారతదేశంలో అత్యధిక నికర విలువను కలిగి ఉన్న ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంపదలో ఐదవ అతిపెద్ద పెరుగుదలను నమోదు చేసింది. గౌతమ్ అదానీ సంపదకు 42.7 బిలియన్ డాలర్లు చేరడంతో దీంతో అతని సంపద ఇప్పుడు 90 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ నికర విలువ 2021లో 13.3 బిలియన్ల డాలర్లకు పెరిగి ఇప్పుడు 97 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.
 

55

రిచెస్ కెన్ ఫండ్ స్కూల్-కాలేజీస్
ఆక్స్‌ఫామ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశంలోని జనాభాలో ధనవంతులైన 10 శాతం మంది ఆరోగ్యం, విద్యపై పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 1 శాతం సర్‌ఛార్జ్ విధించాలని సిఫారసు చేసింది. దేశంలోని టాప్ 10 శాతం మంది ధనవంతుల వద్ద తగినంత సంపద ఉందని, వారు రాబోయే 25 ఏళ్లపాటు దేశంలోని అన్ని పాఠశాలలు ఇంకా కళాశాలలకు నిధులు సమకూర్చగలరని నివేదికలో నిపుణులు తెలిపారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved